జిల్లా కోర్టు ఎదుటే... మురికి కాలువలో 23ఏళ్ల యువతి మృతదేహం
కరీంనగర్ పట్టణంలో అనుమానాస్పద రీతిలో డ్రైనేజీ కాలువలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కరీంనగర్: జిల్లా కోర్టు ఎదుటగల బస్టాప్ వెనుక డ్రైనేజీలో ఓ యువతిని మృతదేహాం కలకలం రేపింది. అనుమానాస్పద రీతిలో డ్రైనేజీ కాలువలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని డ్రైనేజీ నుండి బయటకు తీశారు. పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా దారుణంగా హత్యకు గురయిన యువతి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన యువతి వివరాలు తెలిస్తే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మెడకు చున్నీ బిగించి హత్య చేసి సంఘటన స్థలానికి తీసుకువచ్చి డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 35-40 సంవత్సరాలు, చామనచాయ శరీర రంగు, ఎత్తు 5 ఫీట్లు వుందని పోలీసులు తెలిపారు.
మృతదేహంపై దుస్తులు: కుర్తా పైజమా- రాణి కలర్(ముదురు పింక్) కుర్తా, నీలి రంగు పై గుండ్రని డిజైన్లు కల పైజమా, మెడలో పసుపు తాడులో ఎరుపు, నలుపు పూసలు ఒక పుస్తె లో ఏసుక్రీస్తు సిలువ డిజైన్ కలదు, కాళ్లకు పట్టగొలుసులు ఉన్నాయి. ఎడమ చేతికి స్టీలు గాజులు, చెవులకు స్టీలు చెవి కమ్మలు, ఎడమ చేతి పై మ్యూజిక్ సింబల్ గల టాటూ(పచ్చబొట్టు) ఉన్నదని పోలీసులు వెల్లడించారు.