MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Today Weather : ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఉక్కపోత పెరుగుతుంది

Today Weather : ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఉక్కపోత పెరుగుతుంది

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే నమోదు కానున్నాయి. కానీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?

1 Min read
Arun Kumar P
Published : Feb 25 2025, 08:34 AM IST| Updated : Feb 25 2025, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
Telugu States Weather

Telugu States Weather

Telugu States Weather : ఇంకా ఫిబ్రవరి కూడా ముగియలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో అత్యధికంగా 35 నుండి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు... ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఉక్కపోత కూడా పెరిగిపోతోంది. 

ఈవారం తెలంగాణతో పాటు ఏపీలో వేడిగాలలు వీస్తాయి...దీంతో ఉక్కపోత పెరిగిపోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  ఉత్తర, ఆగ్నేయ, ఈశాన్య దిక్కులనుండి గాలులు వీస్తున్నాయని... వీటితో పాటు తేమ కూడా వస్తోందని తెలిపారు. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదైనా ఉక్కపోత మాత్రం విపరీతంగా ఉంటుందని ప్రకటించారు. 

ముఖ్యంగా తెలంగాణలో ఈ ఉక్కపోత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుండి 37 డిగ్రీలు, కనిష్టంగా 18 నుండి 22 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు.

తెలంగాణలో ఫిబ్రవరి 25 మంగళవారం ఉష్ణోగ్రతలు : 

ఫిబ్రవరి 25 అంటే ఇవాళ మంగళవారం తెలంగాణలో వాతావరణం కాస్త చల్లగానే ఉండనుంది. నిన్నటి(సోమవారం) మాదిరిగానే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. కనిష్టంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 

ఆకాశం మబ్బులు కమ్మేసి కాస్త చల్లగా ఉంటుంది. ఇదే సమయంలో ఉక్కపోత పెరుగుతుంది. గాలితో తేమ శాతం పెరగడమే ఉక్కపోతకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం ఉష్ణోగ్రతలు :

ఫిబ్రవరి 25న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు కాస్త తక్కువగానే కాస్తాయి. కనిష్టంగా 23 డిగ్రీలు, గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిప్రాంతాల్లో మబ్బులు కమ్మేసి వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని తెలిపారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
Recommended image2
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Recommended image3
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved