MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేసీఆర్‌తో ఫైట్: రాజ్యాంగ నిబంధనను ప్రయోగించిన తమిళిసై

కేసీఆర్‌తో ఫైట్: రాజ్యాంగ నిబంధనను ప్రయోగించిన తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అరుదైన చర్యను చేపట్టారు. గత కొంతకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తమైంది. 

2 Min read
Sumanth K
Published : Aug 08 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అరుదైన చర్యను చేపట్టారు. గత కొంతకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తమైంది. 

28

అయితే తాజాగా కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై రాజ్యాంగ నిబంధనను ప్రయోగించారు. ఆర్టికల్ 175(2)ను వినియోగించారు. ఇది గతంలో చాలా అరుదుగా ఉపయోగించబడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. 

38

ఈ రాజ్యాంగ నిబంధన మేరకు.. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెండింగ్ బిల్లులపై తమిళిసై రాష్ట్ర శాసనసభ ఉభయ సభలకు సందేశం పంపారు. అయితే సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రాజ్యాంగ నిబంధను ఉపయోగించి మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సందేశం పంపడం అనేది అరుదైన ఘటన అని చెబుతున్నారు. 

48

ఆర్టికల్ 175 (2) విషయానికి వస్తే.. ఇది శాసన సభ, శాసన మండలి సభ్యులకు గవర్నర్ లేఖ రాయడానికి అనుమతిస్తుంది. ‘‘శాసనసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుకు సంబంధించి రాష్ట్ర శాసనసభ లేదా సభలకు గవర్నర్ సందేశాలు పంపవచ్చు. సందేశం పంపబడిన సభ ఏదైనా విషయాన్ని అన్ని అనుకూలమైన పంపకాలతో పరిగణించాలి. మెసేజ్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆ నిబంధన పేర్కొంటుంది.

58

ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. తెలంగాణ పంచాయితీ రాజ్ (సవరణ) బిల్లు 2023, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీస్ (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ (సవరణ) బిల్లు 2022 గురించి తన ఆందోళనలను ఈ సందేశంలో పేర్కొన్నారు. 

68

దశాబ్దాలలో మొదటిసారిగా శాసనసభకు గవర్నర్ సందేశం పంపారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిరిగి పంపడంతో వాటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిని ఇప్పుడు మళ్లీ రాజ్‌భవన్‌కు పంపితే.. వాటిపై సంతకం చేయడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదు’’ అని నిపుణులు పేర్కొంటున్నారు.

78

అయితే తాను పంపిన మెసేజ్‌ని చదివారా, చర్చ జరిగిందా లేదా అని తెలుసుకోవాలని రాజ్‌భవన్‌ ఆసక్తిగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే, ఒక సందేశం వచ్చిందని, సభ్యులందరికీ కాపీని అందజేశామని స్పీకర్ కేవలం సభకు తెలియజేశారు.

88

అయితే పలు రాష్ట్రాల్లో గవర్నర్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదనేది చూస్తునే ఉన్నామని.. అయితే సభకు సందేశం పంపే హక్కును గవర్నర్ వినియోగించుకున్న సందర్భం చాలా దశాబ్దాలుగా జరగలేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ సందేశం పంపిన తర్వాత, సభ దానిని ప్రతికూలంగా లేదా సానుకూలంగా పరిగణించాలని అంటున్నారు. అయితే సభ్యులు సందేశాన్ని పరిగణించి, బిల్లులను అసలు రూపంలో ఆమోదించడానికి ఎంచుకున్నారని స్వయంచాలకంగా ఊహించబడుతుందని పేర్కొంటున్నారు. 
 

About the Author

SK
Sumanth K

Latest Videos
Recommended Stories
Recommended image1
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Recommended image2
Now Playing
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
Recommended image3
Now Playing
KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved