తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తిన టూర్: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక తేలేనా?
టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఎంపిక చివరి ధశకు వచ్చిందనే చర్చ సాగుతోంది. తమకు పదవుల కోసం కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో మకాం వేయడంతో పీసీసీ చీఫ్ పదవిపైనే చర్చసాగుతోంది.
టీపీసీసీ చీఫ్కి కొత్త బాస్ ఎంపిక త్వరలోనే పూర్తి కానుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నేతల హస్తిన టూర్ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ప్రాధాన్యత చోటు చేసుకొంది.
టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై నివేదికను సోనియాగాంధీకి అందించారు.
2018 నుండి కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కొత్త బాస్ ఎంపిక కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై రిపోర్టును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సోనియాగాంధీకి నివేదికను సమర్పించారు.
పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతలంతా వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీలో మకాం వేశారు.
కేరళ పీసీసీ చీఫ్ ఎంపికను ఇటీవలనే పూర్తి చేసింది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కూడ పూర్తి చేయనుందనే ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడ పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి ప్రయత్నంగా ఢిల్లీలో మకాం వేశారనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తన నియోజకవర్గంలో అభివృద్ది పనుల కోసం తాను ఢిల్లీలో ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడ వ్యక్తిగత పనుల కోసమే హస్తినబాట పట్టినట్టుగా ప్రచారంలో ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడ ఢిల్లీలో ఉన్నారు.
తమకు లేదా తమకు నచ్చినవారికి పీసీసీ చీఫ్ పదవి కోసం నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రత్యర్ధులకు ఈ పదవి దక్కుండా చివరి అస్త్రాలను సంధిస్తున్నారు.