ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు: సాగర్పై కేసీఆర్ కన్ను, విపక్షాలకు చెక్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపాయి.

<p>తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేసీఆర్ కేంద్రీకరించారు.</p>
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేసీఆర్ కేంద్రీకరించారు.
<p>గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.</p>
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
<p><br />సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు.</p>
సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు.
<p>రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాయి.ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత లేదని తేలిందని టీఆర్ఎస్ నేతలు సంతోషంగా ఉన్నారు.</p>
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాయి.ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత లేదని తేలిందని టీఆర్ఎస్ నేతలు సంతోషంగా ఉన్నారు.
<p><br />2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను కేటీఆర్ తన భుజాన వేసుకొన్నారు. అయితే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది.</p>
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను కేటీఆర్ తన భుజాన వేసుకొన్నారు. అయితే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది.
<p>ఆ తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నాయకత్వం పనిచేసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రతి రోజూ కనీసం 8 గంటల పాటు సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాంపై కేంద్రీకరించారు.</p>
ఆ తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నాయకత్వం పనిచేసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రతి రోజూ కనీసం 8 గంటల పాటు సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాంపై కేంద్రీకరించారు.
<p><br />ప్రతి రోజూ పార్టీ నాయకులతో నిరంతరం ఆయన మాట్లాడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్ధేశం చేశారు.</p>
ప్రతి రోజూ పార్టీ నాయకులతో నిరంతరం ఆయన మాట్లాడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్ధేశం చేశారు.
<p>ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ స్థాయి వరకు టీఆర్ఎస్ ప్రచారాన్ని తీసుకెళ్లారు. ఇది పార్టీకి మంచి విజయాన్ని అందించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ ప్రస్తుతం కేంద్రీకరించారు.</p>
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ స్థాయి వరకు టీఆర్ఎస్ ప్రచారాన్ని తీసుకెళ్లారు. ఇది పార్టీకి మంచి విజయాన్ని అందించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ ప్రస్తుతం కేంద్రీకరించారు.
<p>ఎన్నికలు ముగిసేవరకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయా మండలాలకు ఇంచార్జీలుగా నియమించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధినే బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. </p>
ఎన్నికలు ముగిసేవరకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయా మండలాలకు ఇంచార్జీలుగా నియమించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధినే బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
<p>గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. </p>
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
<p><br />ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాలకు చెక్ పెట్టిన తీరులోనే సాగర్ ఉప ఎన్నికల్లో కూడ ప్రత్యర్ధులకు చుక్కలు చూపాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.</p>
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాలకు చెక్ పెట్టిన తీరులోనే సాగర్ ఉప ఎన్నికల్లో కూడ ప్రత్యర్ధులకు చుక్కలు చూపాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
<p>ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నేతలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కొందరు నేతలు ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.</p>
ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నేతలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కొందరు నేతలు ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.