MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Telangana
  • Weather : హైదరాబాద్ లో వాతావరణ మార్పులు... ఆకాశం మేఘావృతం

Weather : హైదరాబాద్ లో వాతావరణ మార్పులు... ఆకాశం మేఘావృతం

తెలంగాణలో నేడు(బుధవారం) ఎండలు మండిపోతే హైదరాబాద్ లో మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే... 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 05 2025, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
Hyderabad Weather

Hyderabad Weather

Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. సాధారణంగా అత్యల్పంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నేడు(మార్చి 5 బుధవారం) ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం చెబుతోంది. 

ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నేడు ఆకాశం మేఘాలు కమ్ముకుని ఉండటంతో వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో కనిష్టంగా 20 డిగ్రీలు, గరిష్టంగా 33 డిగ్రీ సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. అంటే సాధారణం కంటే రెండు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉండే అవకాశాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలాగే మిక్సుడ్ వెదర్ ఉండనుంది. అంటే మేఘాలు అడ్డువచ్చినప్పుడు ఎండలనుండి కాస్త ఉపశమనం...తిరిగి మళ్లీ భానుడి భగభగలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం సమయంలో అవసరం ఉంటేతప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిది.

తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే... 

తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సీయస్ కు చేరువయ్యాయి. నిన్న (మంగళవారం) అత్యధికంగా  ఖమ్మంలో 39.8 డిగ్రీలు,పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండురోజులు కూడా రోజులు కూడా ఎండల తీవ్రత ఇలాగే ఉండనుందని... అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం గరిష్టంగా 32, 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి. 

ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే.. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయివుండటంతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గరిష్టంగా 35 డిగ్రీ సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. 
   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: క‌నీస‌వేత‌నం రూ. 16 వేల‌కు పెంపు.. 1.10 కోటి మందికి ప్ర‌యోజ‌నం
Recommended image2
Telangana: ఇదీ బీఆర్ఎస్ అస‌లు రూపం.. ద‌ళితులు నిర‌స‌న తెలిపితే, శుద్ధి చేస్తారా.?
Recommended image3
Railway: తెలుగు ప్రజలకు కేంద్రం పండగలాంటి వార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్ల పెంపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved