MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • సీఎం కేసీఆర్ సమక్షంలో... దేశాన్నేలిన తెలంగాణ బిడ్డ పివికి అసెంబ్లీ అందించిన గౌరవం (ఫోటోలు)

సీఎం కేసీఆర్ సమక్షంలో... దేశాన్నేలిన తెలంగాణ బిడ్డ పివికి అసెంబ్లీ అందించిన గౌరవం (ఫోటోలు)

దేశ ప్రధానిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం సాదరంగా గౌరవించింది. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 08 2021, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైదరాబాద్: భారత దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు తెలంగాణ అసెంబ్లీ సాదరంగా గౌరవించింది. దివంగత ప్రధాని పివి నిలువెత్తు చిత్రపటాన్ని శాసనసభ భవనంలో ఎమ్మెల్యేల లాంజ్ లో ఏర్పాటు చేసారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు,ఎంపీ కే కేశవరావు గారు, మంత్రులు,  శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లెజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహాచార్యులు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

35

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన దివంగత ప్రధాని పివిని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఎన్నోసార్లు గౌరవించింది. ఆ గౌరవంతోనే ఆయన కూతురు సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ పట్టభద్రుల స్థానం నుండి టీఆర్ఎస్ తరపున నిలిపి గెలిపించుకున్నారు. 

45

ఇక క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు అందుకున్న పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో గట్టేకించారు. ఇలా ఆయన సమర్ధవంతమైన పాలనను గుర్తించాలని... పివికి భారత రత్న ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం.

55

దివంగత పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు కూడా ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా ఏడాదిపాటూ ఈ ఉత్సవాల్ని నిర్వహించడానికి సిద్దమైంది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా వేసి సీనియర్ నాయకులు కే కేశవరావు అధ్యక్షుడిగా నియమించింది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
Recommended image2
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం
Recommended image3
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved