MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సీఎం కేసీఆర్ సమక్షంలో... దేశాన్నేలిన తెలంగాణ బిడ్డ పివికి అసెంబ్లీ అందించిన గౌరవం (ఫోటోలు)

సీఎం కేసీఆర్ సమక్షంలో... దేశాన్నేలిన తెలంగాణ బిడ్డ పివికి అసెంబ్లీ అందించిన గౌరవం (ఫోటోలు)

దేశ ప్రధానిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం సాదరంగా గౌరవించింది. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
| Updated : Oct 08 2021, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైదరాబాద్: భారత దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు తెలంగాణ అసెంబ్లీ సాదరంగా గౌరవించింది. దివంగత ప్రధాని పివి నిలువెత్తు చిత్రపటాన్ని శాసనసభ భవనంలో ఎమ్మెల్యేల లాంజ్ లో ఏర్పాటు చేసారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు,ఎంపీ కే కేశవరావు గారు, మంత్రులు,  శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లెజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహాచార్యులు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

35

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన దివంగత ప్రధాని పివిని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఎన్నోసార్లు గౌరవించింది. ఆ గౌరవంతోనే ఆయన కూతురు సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ పట్టభద్రుల స్థానం నుండి టీఆర్ఎస్ తరపున నిలిపి గెలిపించుకున్నారు. 

45

ఇక క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు అందుకున్న పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో గట్టేకించారు. ఇలా ఆయన సమర్ధవంతమైన పాలనను గుర్తించాలని... పివికి భారత రత్న ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం.

55

దివంగత పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు కూడా ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా ఏడాదిపాటూ ఈ ఉత్సవాల్ని నిర్వహించడానికి సిద్దమైంది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా వేసి సీనియర్ నాయకులు కే కేశవరావు అధ్యక్షుడిగా నియమించింది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image2
ఇక్క‌డ హ‌నుమంతుడు పాతాళంలో ఉంటాడు.. ప్రపంచంలో ఇలాంటి ఏకైక ఆల‌యం మన హైదరాబాద్‌లోనే
Recommended image3
Beer Sales: తెలంగాణలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో బీర్ అమ్మకాలు,ఒక్క ఏప్రిల్ లోనే ఎన్ని బాటిల్స్ తాగేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved