రామప్ప ఆలయ శిల్ప సంపదకు కల్వకుంట్ల కవిత ఫిదా .. మరింత అభివృద్ధి చేస్తామని హామీ
ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మేధావులు, పలువురు ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారని కవిత పేర్కొన్నారు.
kavitha
ములుగు జిల్లాలో వైద్య కళాశాలలు కూడా మంజూరు చేశారని కవిత గుర్తుచేశారు. రామప్ప దేవాలయాన్ని తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సందర్శిస్తున్నారని ఆమె అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మేధావులు, పలువురు ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారని కవిత పేర్కొన్నారు.
kavitha
రామప్ప అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకగా రామప్ప డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందని కవిత తెలిపారు. దీని ద్వారా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం మంత్రి సత్యవతి రాథడ్తో కలిసి కవిత రుద్రేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
kavitha
ములుగులో గిరిజన వర్సీటీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. కానీ ఎలాంటి స్పందనా లేదని కవిత దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే భూమి కేటాయించామని ఆమె తెలిపారు.
kavitha
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు కేటాయించినట్లు కవిత గుర్తుచేశారు. భవిష్యత్లో రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చిన్నారులు, పలువురు సందర్శకులతో కవిత ఫోటోలు దిగారు.