MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • టెస్లా సి‌ఈ‌ఓ ఎలాన్ మస్క్ కంపెనీకి దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి.. ఎందుకు కారణం ఏంటి ?

టెస్లా సి‌ఈ‌ఓ ఎలాన్ మస్క్ కంపెనీకి దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి.. ఎందుకు కారణం ఏంటి ?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్ ఎక్స్ (SpaceX) అధినేత భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే  ఈ ప్లాన్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అవును, ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ నుండి దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 27 2021, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో ఏలోను మస్క్  స్టార్ లింక్ (Starlink) సంస్థకి ఇంకా భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను అందించడానికి లైసెన్స్ జారీ కాలేదని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఈ సంస్థ సర్వీస్ కోసం సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయవద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దీనివల్ల నష్టం జరగవచ్చు అని సూచించారు. 
 

24

కంపెనీ మోసాలలో అస్సలు పడవద్దని
ప్రభుత్వంతో పాటు టెలికమ్యూనికేషన్స్ శాఖ కూడా  స్టార్ లింక్ కంపెనీకి దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరించింది. కంపెనీ చేస్తున్న పబ్లిసిటీ ముసుగులో దేశ ప్రజలు పడవద్దని  ప్రకటనలో పేర్కొన్నారు. డాట్(DoT)అండ్ భారత ప్రభుత్వం స్టార్‌లింక్  అధికారిక వెబ్‌సైట్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే సౌలభ్యాన్ని యూజర్‌కి ఇవ్వడం పట్ల  అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 

34

డాట్(DoT) చెప్పిన పెద్ద విషయం 
భారతదేశంలో సేవలను అందించడానికి స్టార్‌లింక్ ఇంకా లైసెన్స్ పొందలేదని టెలికాం శాఖ (DoT) తెలిపింది. డిపార్ట్‌మెంట్ తరపున ఎలోన్ మస్క్ కంపెనీ ప్రజలకు సబ్‌స్క్రిప్షన్ అందించే ముందు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద అవసరమైన ఆమోదం పొందాలని చెప్పింది. అయితే కంపెనీ రెగ్యులేటరీ విధానాలను పక్కన పెట్టింది ఇంకా  అనుమతి లేకుండా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవ కోసం బుకింగులను ప్రారంభించింది అని తెలిపింది. 

44

గతంలో స్టార్‌లింక్(Starlink)ఇచ్చిన ప్రకటనలో  భారతదేశం స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవ గురించి చాలా ఉత్సాహంతో ఉందని చెప్పింది. దేశంలో ఈ సర్వీస్ ప్రీఆర్డర్ బుకింగ్ సంఖ్య 5000 దాటిందని అంచనా వేయవచ్చు. ఎలోన్ మస్క్ కంపెనీ 2022 చివరి నాటికి దేశంలో ఇంటర్నెట్ సేవను ప్రారంభించాలనుకుంటుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved