MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదు.. తిన్నారో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి జాగ్రత్త

Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదు.. తిన్నారో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి జాగ్రత్త

Diabetes: డయాబెటీస్ పేషెంట్లు తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉది. అవేంటంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 08 2022, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Diabetes: మన దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని సర్వేలు చెబుతున్నాయి.మధుమేహులు తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. 

27

మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిని తింటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది. మరి మధుమేహులు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

ఖర్జూరాలు.. ఖర్జూరా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి ఖర్జూరా పండ్లను మధుమేహులు తినకూడదు. 
 

47

ఎండుద్రాక్ష.. ఎండుద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తింటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మధుమేహులు ఎండుద్రాక్షలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

57

వీటిని కూడా తినకండి.. 
వైట్ బ్రెడ్.. డయాబెటీస్ పేషెంట్లు తీసుకునే ఆహారం మరియు కొన్ని రకాల పానీయాల పట్ల ఎంతో శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా వీరు పిండి పదార్థం ఎక్కువ మొత్తంలో ఉండే ఆహార పదర్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మధుమేహులుు వైట్ బ్రెడ్ ను అస్సలు తినకూడదు. దీన్ని తింటే వీరి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 
 

67

సపోటా.. మధుమేహులు సపోటా పండ్లను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లు తియ్యగా ఉండటంతో పాటుగా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

77

బంగాళాదుంప.. షుగర్ పేషెంట్లు బంగాళాదుంపలను చాలా తక్కువ మొత్తంలో తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిని మోతాదుకు మించి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది. వీటివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు బంగాళాదుంపలను ఎక్కువగా తినకూడదు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
Recommended image2
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Recommended image3
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved