మేకలతో జూమ్ మీటింగ్స్.. రూ.50 లక్షలు సంపాదించిన మహిళ !!
ఆలోచన ఉంటే అండమాన్ లో ఒంటరిగా ఉన్నా బతికేయచ్చని నిరూపిస్తుందో మహిళ. కరోనాతో అందరి బిజినెస్ లూ అతలాకుతలం అయితే తను మాత్రం ఓ చక్కటి ఆలోచనతో ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందో. అది కూడా మేకలతో జూమ్ మీటింగ్ పెట్టి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఆలోచన ఉంటే అండమాన్ లో ఒంటరిగా ఉన్నా బతికేయచ్చని నిరూపిస్తుందో మహిళ. కరోనాతో అందరి బిజినెస్ లూ అతలాకుతలం అయితే తను మాత్రం ఓ చక్కటి ఆలోచనతో ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందో. అది కూడా మేకలతో జూమ్ మీటింగ్ పెట్టి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
తను పెంచే మేకలతో జూమ్ మీటింగ్స్ చేసి ఇప్పటికి అక్షరాలా రూ. 50 లక్షలు సంపాదించింది. అదేంటో తెలియాలంటే... ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
యూకేలోని రాసెండేల్ కు చెందిన డాట్ మెక్ కార్టీకి వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో మేకలను పెంచుతోంది. పంట సాగు చేయడంతోపాటు వ్యవసాయం, మేకల పెంపకంపై అవగాహన కోసం విద్యార్థులను సందర్శనకు అనుమతిస్తూ బాగా సంపాదించేది.
కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు మూతపడడంతో ఆదాయం కాస్త తగ్గింది. లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న మెక్ కార్టీకి ఒక ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులంతా జూమ్ వీడియో సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు.
వీరి మధ్యలోకి మేక వస్తే ఎలా ఉంటుందా? అని సరదాగా వచ్చిన తన ఆలోచననే ఆమె వ్యవసాయక్షేత్రానికి సంబంధించిన వెబ్ సైట్ లో ఓ ప్రకటనగా ఇచ్చింది.
జూమ్ వీడియో సమావేశాల నిర్వాహకులు.. సమావేవంలో పాల్గొనేవారిని ఆశ్చర్యపరచడం కోసం మా మేకలను అద్దెకు తీసుకోవచ్చు. మీరు చెప్పిన సమయానికి మా మేకలు జూమ్ కాల్స్ లో దర్శనమిస్తాయని.. మెక్ కార్టీ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆమె ప్రకటనకు అనూహ్యమైన రీతిలో స్పందన వస్తోంది.
అనేక సంస్థలు తమ ఉద్యోగులను, ఇతరులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను ఆశ్చర్యపర్చడం కోసం మేకను అద్దెకు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక జూమ్ సమావేశానికి మెక్ కార్టీ 5 పౌండ్లు వసూలు చేస్తోంది.
మీటింగ్ టైం, వీడియో లింక్ వివరాలు ఇస్తే చాలు. ఆ టైంకి మెక్ కార్టీ దగ్గర పనిచేసే ఉద్యోగులు మేకను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. ఇలా ఇప్పటివరకు మెక్ కార్టీ 50వేల పౌండ్లు అంటే దాదాపు రూ. 50 లక్షలు సంపాదించింది.