‘ఉప్పెన’ బ్యూటీ కృతికి 'జీ తెలుగు' రూ.1 కోటి పే చేసారు...ఎందుకంటే
జీటీవి ఎందుకు ఆమెకు అంత పెద్ద మొత్తం ఇవ్వబోతోంది. ఏదన్నా టీవిలో పోగ్రాం చేస్తోందా...ఇంత బిజీ టైమ్ లో టీవీ వైపు ఆమె ప్రయాణం ఏమిటి...ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
‘ఉప్పెన’ ప్రేక్షకులకి చేరువకావడంలో హీరోయిన్ కృతి శెట్టి ప్రధాన కారణమని చెప్పొచ్చు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో యువ మనసుల్ని కొల్లగొట్టి ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ అంటూ పాటలతోనే ఫిదా చేసేసింది.
ట్రైలర్, టీజర్స్ చూసిన సినీ ప్రియులు.. ఈ ముద్దుగుమ్మను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆశగా ఎదురు చూశారు. ఆ మధ్యన సినిమా విడుదలైంది.. బేబమ్మగా కనిపించి ఆకట్టుకుంది కృతి. తొలి పరిచయంలోనే స్టార్ హీరోయిన్స్ కు ఉండే ఫాలోయింగ్ సంపాదించుకుంది. అన్నింటికీ కారణం ఆ పాత్రలో ఒదిగిపోవడం.
నటన అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ దాన్నే కెరీర్గా భావించలేదు అంటోంది కృతి శెట్టి. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించిన ఈ భామ ‘ఉప్పెన’తో హీరోయిన్ గా మారింది. వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టరైంది.
కృతి స్వస్థలం బెంగళూరు. అయితే పెరిగిందంతా ముంబయిలోనే. నాన్న వ్యాపారవేత్త, అమ్మ ఫ్యాషన్ డిజైనర్. మెథడ్ యాక్టింగ్ అంటే ఇష్టం. శ్రీదేవి, సమంత.. నటనలో వీళ్లే నా స్ఫూర్తి.
చికెన్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ చేయడం హాబీ అని చెప్తోంది.
కృతి 11 ఏళ్ల వయసులోనే ఓ యాడ్ ఫిలింలో నటించింది. ఓసారి యాడ్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు దర్శకుడు బుచ్చిబాబు కలిశారు. ఆయన చెప్పిన కథ ఆకట్టుకుంది. పైగా మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడం మరో అడ్వాంటేజ్ అనిపించింది.
హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు అనుకొని కృతి శెట్టి ఒప్పుకుంది. ఇంత బాగా నటిస్తుందని ఎవరూ అనుకోలేదు. కృతిని తెరపై చూసినపుడు చాలా సంతోషం కలిగింది ఆమె తల్లి,తండ్రులకు. తల్లి ఎప్పుడూ షూటింగ్ సమయంలో కృతితోనే ఉన్నారు. ఆమె కోసం నా జాబ్ని వదిలేశాను. తన నటనతో మా కష్టాన్నంతా మర్చిపోయేలా చేసింది. ప్రస్తుతం సైకాలజీ చదువుతోంది. చదువులోనూ చురుకుగా ఉంటుంది అని చెప్తారామె.
ఇక జీ టీవి షయానికి వస్తే ఆమెకు కోటిరూపాయలు ఇస్తున్నారు. ఎందుకూ అంటే ఆమె జీ టీవిలో వచ్చే పోగ్రామ్ లు, టీవి సీరియల్స్ ఎండార్స్ చేయటానికి , అప్పడప్పుడూ ఈవెంట్స్ లో కనిపించటానికి ఆమె కు చానెల్ వాళ్లు అందిస్తున్న మొత్తం అది.
ప్రతీ సంవత్సరం జీ తెలుగువారు ఓ సెలబ్రెటీని తమ సీరియల్స్ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇప్పించటానికి, ఈవెంట్స్ లో కనపడటానికి తీసుకుంటారు. గతంలో మహేష్ బాబు, రమ్యకృష్ణ కూడా ఇలా కనపడినవారే. ఈ సంవత్సరం కృతిని తీసుకున్నారు. అయితే ఇందులో పెద్ద విశేషం ఏమిటీ అంటే ఆమెకు ఆఫర్ చేసిన మొత్తం.
ఒకే ఒక్క సినిమాతో పాపులరైన కృతికు కోటి రూపాయలు ఓ టీవీ ఛానెల్ ఆఫర్ చేయటం తెలుగు టీవి చరిత్రలో రికార్డ్ అంటున్నారు. నిజమే కదా సక్సెస్ ఎలాంటివారినైనా ఏ స్దాయికి అయినా తీసుకెళ్తుంది. దాంతో ఇదో పెద్ద సెన్సేషన్ న్యూస్ అయ్యింది. ఆమెకు ఉన్న క్రేజ్ ని ఈ డీల్ తెలియచేస్తోంది.
నా ఫొటోల్ని ‘పూరీ కనెక్ట్స్’ ఏజెన్సీ ద్వారా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు గారు చూసి ఆడిషన్స్ కోసం హైదరాబాద్ రమ్మన్నారు. ఆడిషన్ సమయంలో సీన్లు చెప్పి నటించమని అడగలేదు. బొట్టు పెట్టుకోమన్నారు. అటూఇటూ నడవమని చెప్పారు. తర్వాత కాసేపటికి ఎంపికచేసినట్లు చెప్పారు అని ఆనందంగా చెప్తుంది కృతి.
అప్పటికి దాదాపు రెండువేల మంది అమ్మాయిల ఫొటోల్ని పరిశీలించాక నన్ను ఎంపికచేశారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా అన్నారు. ఉప్పెన షూటింగ్ ఓ యాక్టింగ్ స్కూల్ అనుభవాన్ని ఇచ్చింది. ఒకటికి రెండు టేక్లు తీసుకున్నా దర్శకుడు ఎంతో ఓర్పుగా చెప్పేవారు.
వైష్ణవ్కి కూడా మొదటి సినిమా కావడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రోత్సహించుకునేవాళ్లం. విజయ్ సేతుపతిగారి లాంటి యాక్టర్ల నటనని లైవ్లో చూడటం మంచి అవకాశం. ఆయనే నాకు నటనలో చాలా విషయాలు నేర్పారు.
ఒకసారి నేను చేసిన సీన్ని మానిటర్లో చూసిన సినిమాటోగ్రాఫర్... ‘నీ భావోద్వేగాలతో ఏడిపించేశావ్’ అని కళ్లు తుడుచుకుంటూ చెప్పారు. ఆ మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేను.వారంలో తెలుగు నేర్చుకున్నా షూటింగ్ మొదలవ్వడానికి ముందు వారంపాటు వర్క్షాప్ నిర్వహించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ల సాయంతో తెలుగు నేర్చుకున్నా. సినిమాకి డబ్బింగ్ చెప్పలేదు కానీ, షూటింగ్ సమయంలో ప్రతి డైలాగునీ తెలుగులోనే చెప్పా. సినిమా పూర్తయిన టైమ్కి తెలుగు అర్థమవ్వడమే కాదు, మాట్లాడటమూ వచ్చేసింది.
హైదరాబాద్లో ఉన్నపుడు దివ్యారెడ్డి గారి దగ్గర కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. ‘ఉప్పెన’లో ‘ఈశ్వర... పరమేశ్వరా’ పాటకు కూచిపూడి డ్యాన్స్ చేసి ఒక వీడియో తీశాం. అది యూట్యూబ్లో పెడితే లక్షల వ్యూస్ వచ్చాయి.