ఎంటర్ అవుతూనే మగాళ్లకు పరీక్ష పెట్టిన స్వాతి దీక్షిత్...తన మనసు గెలిచిన ఆ నలుగురు అబ్బాయిలతో పార్టీ చేసుకుంది
బిగ్ బాస్ ఎపిసోడ్ 20లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.బిగ్ బాస్ ఇంటి సభ్యులు నియమాలు పాటించడం లేదని శిక్ష విధించారు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ మేల్ కంటెస్టెంట్స్ కి ఓ పరీక్ష పెట్టడంతో పాటు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది.
బిగ్ బాస్ సీజన్ ఫోర్ సక్సెస్ ఫుల్ గా 20వ ఎపిసోడ్ లోకి ఎంటరైపోయింది. శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. రోబో, హ్యూమన్ టాస్క్ సమయంలో సోహైల్, మెహబూబ్ చేసిన హైడ్రామాను గంగవ్వ నటించి చూపించారు. దానికి అందరూ ఇంటి సభ్యులు నవ్వడం జరిగింది.
ఇక ఇంటిలో ఉన్న సభ్యులు కొన్ని ప్రాధమిక నియమాలు పాటించడం లేదని బిగ్ బాస్ కోప్పడ్డారు. మైక్ సరిగా ధరించడం లేదని, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని ఇంటి సభ్యుల లగ్జరి బడ్జెట్ మరియు రేషన్ లో కోత విధించారు. దీనితో షాక్ కి గురైన ఇంటి సభ్యులు బిగ్ బాస్ కి సారీ చెప్పారు.
ఇక నేటి ఎపిసోడ్ లో కీలక పరిణామం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బుట్ట బొమ్మా సాంగ్ తో ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ కి ఇంటి సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. స్వాతి వస్తూ వస్తూ మగవాళ్ల కోసం సర్ప్రైజ్ తెచ్చారని బిగ్ బాస్ చెప్పారు. కాకపోతే ఇంటిలోని మేల్ కంటెస్టెంట్స్ స్వాతిని ఇంప్రెస్స్ చేయాలని చెప్పారు. కొందరు మాటలతో, కొందరు పాటలతో స్వాతిని ఇంప్రెస్స్ చేసే ప్రయత్నం చేశారు.
స్వాతి తనను బాగా ఇంప్రెస్స్ చేసిన వారిగా మొదట అఖిల్, నోయెల్, రాజశేఖర్ మరియు అవినాష్ ని ఎంపిక చేశారు. ఈ నలుగురితో పాటు ఆమెకు లాంజ్ లో బిగ్ బాస్ పార్టీ ఏర్పాటు చేశాడు. మిగతా ఇంటి సభ్యులను ఆ పార్టీలోకి అనుమతించలేదు. ఈ ఐదుగురు లాంజ్ లో స్పెషల్ ఫుడ్, డ్రింక్స్ తో మంచి పార్టీ చేసుకున్నారు.
ఎనర్జిటిక్ సాంగ్స్ తో పార్టీలో అందరూ రెచ్చిపోయారు. సోహైల్ మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం బాధపడగా, మెహబూబ్ టాస్క్ లు ముఖ్యం కాదు, ఇక్కడ అందరూ ఒకరితో రిలేషన్స్ పెట్టుకుంటున్నారని...అదే ముఖ్యం, లేకపోతే బిస్కెట్ కావడం ఖాయం అన్నాడు.
స్వాతి దీక్షిత్ రాకతో ఓ కొత్త జంట రూపుదిద్దుకునే అవకాశం కలదు. ఇక రేపటి రేపటి ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున ఎంటర్ కానున్నారు. అలాగే ఎలిమినేషన్ కి ఎంపికైన ఏడుగురు సభ్యులలో కొందరిని సేవ్ చేయనున్నాడు.