బ్యాంక్ ఉద్యోగి నుంచి అగ్ర గీత రచయిత వరకు అసాధారణమైన సినీ ప్రస్థానం..
వెన్నెలకంటి.. తెలుగు సినిమా సాహిత్యంలో ఆయనది ప్రత్యేక స్థానం. సాహిత్యంలోని లోతులను పాటల రూపంలో ప్రాణం పోశారు. సాహిత్యానికి గ్లామర్ అద్దారు. తెలుగు సినీ సాహిత్యంలో మూడున్నర దశాబ్దాలుగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన వెన్నెలకంటి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. కొత్త ఏడాది వేళ వెన్నెలకంటి మరణం టాలీవుడ్ని విషాదంలో ముంచెత్తింది.
17

వెన్నెలకంటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ అయిన ఆయన అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్ పాటలతో పాపులర్ అయిన వెన్నెలకంటి పాటల రైటర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
వెన్నెలకంటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ అయిన ఆయన అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్ పాటలతో పాపులర్ అయిన వెన్నెలకంటి పాటల రైటర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
27
నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వెన్నెలకంటి సినీ ప్రస్థానం విభిన్నంగా ప్రారంభమైంది. ఆయన తమ ఊరు దగ్గరలో ఉండే విజయలక్ష్మి టాకీసులో ఎక్కువగా పౌరాణిక సినిమాలు చూసేవారట. వాటిని ఒకటికి రెండు మూడు సార్లు చూసేవారు. ఆ సినిమాల ద్వారానే తనకు సాహిత్యం పట్టు, ఆసక్తి ఏర్పడేలా చేసింది. థియేటరే ఆయనకు గురువయ్యింది.
నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వెన్నెలకంటి సినీ ప్రస్థానం విభిన్నంగా ప్రారంభమైంది. ఆయన తమ ఊరు దగ్గరలో ఉండే విజయలక్ష్మి టాకీసులో ఎక్కువగా పౌరాణిక సినిమాలు చూసేవారట. వాటిని ఒకటికి రెండు మూడు సార్లు చూసేవారు. ఆ సినిమాల ద్వారానే తనకు సాహిత్యం పట్టు, ఆసక్తి ఏర్పడేలా చేసింది. థియేటరే ఆయనకు గురువయ్యింది.
37
ఆ తర్వాత కవి సమ్మేళనంలో నాగభైర కోటేశ్వరరావు పరిచయం అయ్యారు. ఆయన రెండో గురువు. ఆయన పేరుతోనే ఇప్పటికీ వెన్నెలకంటి అవార్దులు ఇస్తుండటం విశేషం. ఆయన్నే తనకు తండ్రిగా భావిస్తుంటారు. అంతగా తనలో సాహిత్యాన్ని తట్టిలేపారు.
ఆ తర్వాత కవి సమ్మేళనంలో నాగభైర కోటేశ్వరరావు పరిచయం అయ్యారు. ఆయన రెండో గురువు. ఆయన పేరుతోనే ఇప్పటికీ వెన్నెలకంటి అవార్దులు ఇస్తుండటం విశేషం. ఆయన్నే తనకు తండ్రిగా భావిస్తుంటారు. అంతగా తనలో సాహిత్యాన్ని తట్టిలేపారు.
47
పదకొండేళ్ల వయసులో ఆటవెలదిలో `భక్త దుఖనాశ పార్వతీశ మకుటం` పేరుతో శతకం రాశారు వెన్నెలకంటి. 13ఏళ్లకే కందంలో లలితా శతకం రాశారు. కాలేజీకొచ్చిన శ్రీరామనవమి రోజు 108 పద్యాలు రాశారు. అభ్యుదయ కవిత్వం పరిచయమయ్యాక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేరారు. అనంతరం ఉషోదయం ఆపలేవు కవితా సంపుటిని రాశారు. `ఆత్మావత్ సర్వభూతాని`, `యత్ర నార్యస్తు పూజ్యంతే` అనే సాంఘిక నాటికలు రచించారు.
పదకొండేళ్ల వయసులో ఆటవెలదిలో `భక్త దుఖనాశ పార్వతీశ మకుటం` పేరుతో శతకం రాశారు వెన్నెలకంటి. 13ఏళ్లకే కందంలో లలితా శతకం రాశారు. కాలేజీకొచ్చిన శ్రీరామనవమి రోజు 108 పద్యాలు రాశారు. అభ్యుదయ కవిత్వం పరిచయమయ్యాక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేరారు. అనంతరం ఉషోదయం ఆపలేవు కవితా సంపుటిని రాశారు. `ఆత్మావత్ సర్వభూతాని`, `యత్ర నార్యస్తు పూజ్యంతే` అనే సాంఘిక నాటికలు రచించారు.
57
వెన్నెలకంటిలోని కవితా, సాహిత్య ప్రతిభని చూసిన నటులు ప్రభాకర్రెడ్డి మొదటి అవకాశం ఇచ్చారు. తానీ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని చెబుతుంటారు. ఆ తర్వాత తనని ప్రోత్సహించిన వారిలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నారు. కోదండపాణి, బాలు తనకు అవకాశాలిచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు.
వెన్నెలకంటిలోని కవితా, సాహిత్య ప్రతిభని చూసిన నటులు ప్రభాకర్రెడ్డి మొదటి అవకాశం ఇచ్చారు. తానీ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని చెబుతుంటారు. ఆ తర్వాత తనని ప్రోత్సహించిన వారిలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నారు. కోదండపాణి, బాలు తనకు అవకాశాలిచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు.
67
శేష గిరీశం సంగీతానికి పాటలు రాయడం వల్ల సినిమా పాటలు రాయడం తేలికైందని వెన్నెలకంటి పలు మార్లు చెబుతుంటారు. తాను బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడే నటుడు, నాటక దర్శకుడు వై.కామేశ్వరరావు పరిచయం అయ్యారట. తాను కవిత్వంలో అన్ని శాఖలూ రాసినా, `నీకు పాట మీద పట్టుంది. దాన్ని గట్టిగా పట్టుకో` అని పాత్రికేయుడు ఎం.వి.ఎస్.ప్రసాద్ ప్రోత్సహించారు. వీరు వెన్నెల కంటి కెరీర్లో ముఖ్యమైన వ్యక్తులుగా నిలిచారు.
శేష గిరీశం సంగీతానికి పాటలు రాయడం వల్ల సినిమా పాటలు రాయడం తేలికైందని వెన్నెలకంటి పలు మార్లు చెబుతుంటారు. తాను బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడే నటుడు, నాటక దర్శకుడు వై.కామేశ్వరరావు పరిచయం అయ్యారట. తాను కవిత్వంలో అన్ని శాఖలూ రాసినా, `నీకు పాట మీద పట్టుంది. దాన్ని గట్టిగా పట్టుకో` అని పాత్రికేయుడు ఎం.వి.ఎస్.ప్రసాద్ ప్రోత్సహించారు. వీరు వెన్నెల కంటి కెరీర్లో ముఖ్యమైన వ్యక్తులుగా నిలిచారు.
77
దాదాపు మూడు వందలకుపైగా సినిమాల్లో రెండు వేలకుపైగా పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పర్చుకున్న వెన్నెలకంటి రాసిన పాటల్లో `చిన్న చిన్న కన్నయ్యకు వెన్నెల జోల` పాట తనకు ఎంతో పేరుని తీసుకొచ్చింది. వెన్నెలకంటి మంగళవారం అకాల మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వెన్నెలకంటికి ఇద్దరు కుమారులు శశాంక్, రాకేందు మౌలి ఉన్నారు. శశాంక్ మాటల రచయితగా, రాకేందు పాటల రచయితగా, నటుడిగా రాణిస్తున్నారు.
దాదాపు మూడు వందలకుపైగా సినిమాల్లో రెండు వేలకుపైగా పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పర్చుకున్న వెన్నెలకంటి రాసిన పాటల్లో `చిన్న చిన్న కన్నయ్యకు వెన్నెల జోల` పాట తనకు ఎంతో పేరుని తీసుకొచ్చింది. వెన్నెలకంటి మంగళవారం అకాల మరణం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వెన్నెలకంటికి ఇద్దరు కుమారులు శశాంక్, రాకేందు మౌలి ఉన్నారు. శశాంక్ మాటల రచయితగా, రాకేందు పాటల రచయితగా, నటుడిగా రాణిస్తున్నారు.
Latest Videos