నా కెరీర్లో అది టఫ్ ఎపిసోడ్.. ఆసక్తికర విషయం చెప్పిన సాయి పల్లవి
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మల్లార్ బ్యూటీ సాయి పల్లవి. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.
సాయి పల్లవి సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, తన గ్లామర్, బోల్డ్ పర్సనాలిటీ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతుంది ఈ బ్యూటీ.
ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఓ విషయంలో కంట్రోల్ కోల్పోయిన సందర్భాన్ని వివరించింది. అయితే అది పర్సనల్ విషయంలో కూడా ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన సరదా సంఘటనను వివరించింది సాయి పల్లవి.
ఫిదా సినిమా షూటింగ్ కోసం సాయి పల్లవి ట్రాక్టర్ను నడపటం నేర్చుకుంది. అయితే షూటింగ్ కోసం ఆమె తడి నేలలో ట్రాక్టర్ను నడపాలి. కానీ కొత్తగా ట్రాక్టర్ను నడుపుతన్నట్టుగా అనిపించకూడదు. అది అంత సులువైన విషయం కాదని చెప్పింది సాయి పల్లవి. ఆ సన్నివేశాల షూటింగ్ సందర్భంగా ఆమె చాలా సార్లు కంట్రోల్ కోల్పోయిందట. అది తన ఫిలిం కెరీర్లోనే కఠినమైన సీన్ అని చెప్పింది సాయి పల్లవి.
సున్నితంగా ఉండే ఓ మహిళ అలాంటి ఓ టఫ్ వెహికల్ను డ్రైవ్ చేయటం నిజంగానే అంత సులభం కాదు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సాయి పల్లవి త్వరలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 1992 నాటి కథతో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకుడు.