పట్టుపరికిణీలో బుట్ట బొమ్మలా తయారైన రష్మీ... ట్రెడిషన్ వేర్ లో కూడా కాక పుట్టించిందిగా!
మగువలకు అలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు, వేడుకలు లాంటి సందర్భాలలో తాము ప్రత్యేకంగా కనిపించాలని, తెగ హైరానా పడిపోతారు.
ఇక సెలెబ్రిటీ లేడీస్ ఐతే, దానిని ప్రాణంగా భావిస్తారు. నిన్న ఉగాది పండగను పురస్కరించుకొనిబుల్లితెర, వెండితెర సీలెబ్రిటీలు, తారలు ప్రత్యేకంగా తయారయ్యారు. సాంప్రదాయ వస్త్ర ధారణలో చందమామల వలె మెరిశారు.
వాళ్లలో హాట్ యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ కూడా ఉన్నారు. పింక్ కలర్ ఓణీ, స్కై బ్లూ కలర్ లంగా, జాకెట్ ధరించి అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆమె తయారయ్యారు.
సాంప్రదాయ వస్త్రధారణకు సెట్ అయ్యేలా బంగారు ఆభరణాలు ధరించి, నిండుగా తయారై దర్శనం ఇచ్చింది రష్మీ. ఇక సాంప్రదాయ వస్త్రధారణలో కూడా రష్మీ గ్లామర్ మాత్రం కిక్ ఇచ్చేదిగా ఉంది.
చూపించి చూపించినట్లు ఫ్యాన్స్ తో దోబూచులు ఆడింది రష్మీ. రష్మీ ట్రేడిషల్ లుక్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ ఆమె ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు.
స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ కలిగిన రష్మీ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మైండ్ పోవాల్సిందే. మిలియన్స్ లో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ని ఫాలో అవుతున్నారు.
ఫోటో షూట్స్ తో రష్మీ చేసే హాట్ షో కూడా దీనికి కారణం. ఇక బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది రష్మీ. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ కలిగిన ఢీ, జబర్దస్త్ వంటి షోల్లో ఆమె యాంకర్ గా ఉన్నారు.
యాంకరింగ్ తో పాటు తనదైన గ్లామర్, రొమాన్స్ పంచుతూ సదరు షోలకు ఆకర్షణ తీసుకువస్తున్నారు. ప్రత్యేక షో అంటే మొదట రష్మీ పేరే గుర్తుకు వస్తుంది.
హీరోయిన్ గా మాత్రం రష్మీకి అవకాశాలు తగ్గాయి. గతంలో వలె ఆమెకు వరుస ఆఫర్స్ రావడం లేదు. నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ హీరోయిన్ కాగా, విడుదలకు సిద్ధంగా ఉంది.