సంచలన నిర్ణయం తీసుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్..యాక్టింగ్కి గుడ్బై !
ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనిత హసానందాని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల తనకు బాబు పుట్టిన నేపథ్యంలో సెన్సేషనల్ ప్రకటన చేసింది. తాను నటనకు గుడ్బై చెబుతున్నట్టు వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చింది.
అనిత హసానందాని.. ఉదయ్ కిరణ్తో `నువ్వు నేను` చిత్రంలో నటించింది. దర్శకుడు తేజ రూపొందించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అటు ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్తో స్టార్ కావడమే కాదు, అనిత కూడా విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత `శ్రీరాం`, `తొట్టిగ్యాంగ్`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఆడంతే అదో టైపు`, `ఇది సంగతి`, `ఆహా నా పెళ్లంట`, `మనలో ఒకడు` వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ కన్నడ చిత్రాల్లో నటించి దాదాపు 15ఏళ్లపాటు నటిగా రాణించింది.
మరోవైపు సినిమాలతోపాటు సీరియల్స్ కూడా చేసుకుంటూ వచ్చింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ నటిస్తూ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన అనిత హసానందాని 2013లో బిజినెస్ మ్యాన్ రోహిత్రెడ్డిని వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. అడపాదడపా సీరియల్స్ చేసింది. `నాగిని` సీరయల్ తో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దాదాపు ఏడేళ్ల దాంపత్య జీవితం అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 9న అనిత పండంటి మగబిడ్డకిజన్మనిచ్చింది. బాబుకి ఆరవ్ రెడ్డి అని నామకరణం చేశారు.
తాజాగా అనిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యాక్టింగ్ కెరీర్కి గుడ్బై చెప్పింది. ఇకపై సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందట. ఈ విషయాన్ని అనిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వెండి తెరతో పాటు బుల్లి తెరకు దూరంగా ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు అనిత. పూర్తి సమయాన్ని తన చిన్నారికి కేటాయించాలని నిర్ణయించుకుంది అనిత.
`ప్రస్తుతం నటన అనేది నా చివరి ప్రయారిటీ. ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తానో నాకే తెలియదు. ఇంతకుముందే కొన్ని బ్రాండ్లకు సైన్ చేసినందుకు ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నా.. యాడ్ షూటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయి. షూట్ కోసం వచ్చిన వ్యక్తులకు ముందే కోవిడ్ టెస్ట్ నిర్వహించి నెగిటివ్ వచ్చాకే లోపలికి అనుమతిస్తున్నాం. మళ్లీ నటిస్తానా? లేదా? అన్నది నాకే తెలియదు. ఒకవేళ మళ్లీ రీఎంట్రీ ఉంటే తప్పుకుండా చెబుతా` అని వెల్లడించింది.