పెళ్ళి చేసుకుంటూనే లైఫ్ కాలిపోతుందన్న జంట.. ఒక్కటైన నటి సులగ్నా, హాస్యనటుడు బిస్వా కళ్యాణ్
కొత్తగా పెళ్ళి చేసుకుంటుంది ఆ జంట. ఒకరు పాపులర్ నటి, మరొకరు పాపులర్ కమేడియన్. మూడు ముళ్ళు పడనేలేదు. అప్పుడే జీవితంపై సెటైర్లు వేసుకున్నారు. తమ బ్యాచ్లర్ లైఫ్ ఎలా కాలిపోతుందో చూడండి అంటూ పోస్ట్ లు కూడా పెట్టుకున్నారు. ఇంతకి వాళ్లెవరనేగా మీ డౌట్. అదేంటో మీరే చూడండి.
టీవీ, సినీ నటి సులగ్నా, పాపులర్ స్టాండప్ కమేడియన్ బిస్వా కల్యాణ్ రాత్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇటీవల వీరి మ్యారేజ్ జరిగింది.
ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ పెళ్ళి ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
సులగ్నా మండపంలో కూర్చుని ఉన్న వారి రెండు ఫోటోలను షేర్ చేస్తూ, `మొదటి ఫోటోలో మా సింగిల్ లైఫ్ ఎలా కాలిపోతుందో చూడవచ్చు` అని సరదాగా పోస్ట్ చేసింది. రెండో ఫోటోకి `సరదాగా ఉన్నప్పుడు.. వాహ్ మా మ్యారేజ్ జరిగిపోయింది` అంటూ చమత్కరించారు.
మరోవైపు బిస్వా కల్యాణ్ రాత్ అమెజాన్ప్రైమ్ వీడియోస్ ప్రసారమవుతున్న `బిస్వా మస్ట్ ఆద్మీ` సిరీస్ టైటిల్తో `బిస్వా మ్యారీడ్ ఆద్మీ` అంటూ తనదైన శైలిలో పెళ్ళి వార్తని ప్రకటించాడు. వీరి పెళ్ళి ఫోటోలను చూసి వారి అభిమానులు, సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నటి సులగ్నా టీవీల్లో ప్రసారమయ్యే `అంబర్ ధారా`, `దో సహేలియాన్ కిస్మత్ కి కత్సుతాలియన్` వంటి సీరియల్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. దీంతోపాటు ఇమ్రాన్ హష్మి నటించిన `మర్డర్ 2`, `రెడ్`, `ఇష్క్ వాలా లవ్` వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు.
బిస్వా ప్రముఖ కామెడియన్ మాత్రం కాదు కంటెంట్ రైటర్ కూడా. `ప్రెటెన్షియస్ మూవీ రివ్యూస్` కామెడీ సిరీస్తో కమెడియన్గా గుర్తింపు పొందాడు. హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.