డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన స్టార్ హీరోలు
జయాపజయాలు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ వరుస డిజాస్టర్స్ అందితే హీరోల కెరీర్ పై అది చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆ లిస్ట్ టాలీవడ్ లో పెద్దగానే ఉంది. డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన వారిలో ఎక్కువ యువ హీరోలే ఉన్నారు. అందులో కొంతమంది నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం పదండి.
అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
రవితేజ: రాజా ది గ్రేట్ అనంతర సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకున్న మాస్ రాజా మళ్ళీ నెల టిక్కెట్టు - టచ్ చేసి చూడు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు డిస్కో రాజా అనే సైన్స్ ఫిక్చన్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టపడుతున్నాడు.
గోపీచంద్: మంచి మాస్ సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న గోపీచంద్ సక్సెస్ ని చూసి చాలా కాలమవుతోంది. ఆక్సిజన్ - గౌతమ్ నందా - పంతం సినిమాలు ఏవి కూడా మనోడికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం చాణక్య సినిమాతో రెడీ అవుతున్నాడు.
మంచు మనోజ్: ఈ యువ హీరో ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. కరెంట్ తీగ తరువాత చేసిన అయిదు సినిమాలు బిగ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఒక డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు.
శర్వానంద్: శతమానం భవతి - మహానుభావుడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శర్వా ఆ తరువాత చేసిన పడి పడి లేచే మనసు - రణరంగం సినిమాలు భారీ నష్టాలతో షాకిచ్చాయి. ప్రస్తుతం 96 రీమేక్ తో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రాజ్ తరుణ్: కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలతో అందరిని ఆకర్షించిన యువ హీరో తరుణ్ భాస్కర్ ఆ తరువాత వరుసగా 6 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాతో బిజిగా ఉన్నాడు.
నితిన్: అఆ సినిమాతో తన మార్కెట్ ను పెంచుకున్న నితిన్ లై సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. అనంతరం ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రంగ్ దే - భీష్మా అనే డిఫరెంట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో చంద్ర శేఖర్ యేలేటి - కృష్ణ చైతన్య లతో కూడా వర్క్ చేయనున్నాడు.
అల్లరి నరేష్: సుడిగాడు సినిమా తరువాత పదికి పైగా సినిమాలు చేసిన నరేష్ మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. రీసెంట్ గా మహేష్ మహర్షి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసి పరవాలేధనిపించాడు. నెక్స్ట్ బంగారు బుల్లోడు సినిమాతో సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. అలాగే సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేసేందుకు కూడా నరేష్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆది: ప్రేమ కావాలి - లవ్లీ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకోని సెట్టయ్యాడనుకున్న ఆది సాయి కుమార్ ఆ తరువాత వరుసగా 8 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం జోడి - ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
అల్లు శిరీష్: 5 సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ శ్రీ రస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఒక్క క్షణం - ఎబిసిడి సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం శిరీష్ రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మతో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.