ఫార్మ్ లో ఉన్నప్పుడు తల్లిని చేస్తారా... క్రేజీ ప్రాజెక్ట్ వద్దన్న రష్మిక!
టాలీవుడ్ లో సమంత తరువాత అంత వేగంగా స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈ కన్నడ బ్యూటీ సినిమాలో ఉందంటే హిట్టే. గోల్డెన్ లెగ్ ఇమేజ్ తో వరుస హిట్స్ కొట్టి, టాప్ రేంజ్ లోకి దూసుకు వచ్చింది.
ఎవ్వరికీ కలిసిరాని కోవిడ్ ఇయర్ 2020లో కూడా రష్మిక రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ సరిలేరు నీకెవ్వరు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది ఆ చిత్రం.
ఇక వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న నితిన్ కి భీష్మ రూపంలో హిట్ తగలగా, ఆ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించడం విశేషం. అలా గత ఏడాది రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దున్నేస్తుంది ఈ కరెంటు కళ్ళ చిన్నది. హిందీలో డెబ్యూ మూవీగా మిషన్ మజ్ను తో అరంగేట్రం చేస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు.
ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ లో రష్మిక లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారని అర్థం అవుతుంది.
అలాగే ఓ తెలుగు చిత్రం, మరో హిందీ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కాగా షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రశ్మికను సంప్రదించగా, ఆమె రిజెక్ట్ చేశారు.
నాని హీరోగా 2019లో విడుదలైన జెర్సీ మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ రీమేక్ చేస్తున్నారు. ఆ మూవీలో హీరోయిన్ గా చేయాలని రశ్మికను సంప్రదించగా రిజెక్ట్ చేశారు.
జెర్సీ మూవీలో హీరోయిన్ పదేళ్ల పిల్లాడికి తల్లి. కెరీర్ ఊపులో ఉన్నప్పుడు తల్లి పాత్ర చేయడం అంత శ్రేయస్కరం కాదని, రష్మిక ప్రాజెక్ట్ చేయనని చెప్పడం జరిగింది.
ఇక రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ జంట, ఆఫ్ స్క్రీన్ లో కూడా రొమాన్స్ చేసుకుంటున్నారని టాక్.