అక్షర అశ్లీల ఫొటోలు నెట్ లో లీక్, ఇన్నాళ్లకు పెదవి విప్పాడు
కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ప్రైవేట్ ఫొటోలు దాదాపు రెండేళ్ల క్రితం ఆన్లైన్లో లీకైన అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాజీ ప్రియుడే ఆమె అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడా? అనే అంశంనసామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అప్పట్లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అక్షర మాజీ ప్రియుడు, అలనాటి నటి రతి అగ్నిహోత్రి కుమారుడు, నటుడు తనుజ్ వీర్వానీ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతణ్ని విచారించనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాల్సిందిగా తనుజ్కు ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆ ఫొటోలు తనుజ్ ఒక్కడి వద్దే ఉన్నట్లు అక్షర చెప్పిందని పోలీసులు తెలిపారు. 2013లో అక్షర తన వ్యక్తిగత ఫొటోలను తనుజ్కు షేర్ చేసిందని, 2016లో వారిద్దరూ విడిపోయారని పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయమై ఇన్నాళ్లకు ఆమె మాజీ ప్రియుడు తనూజ్ నోరు విప్పి మాట్లాడారు.
అప్పట్లో ఆ ఫొటోలు తనుజ్ ఒక్కడి వద్దే ఉన్నట్లు అక్షర చెప్పిందని పోలీసులు తెలిపారు. 2013లో అక్షర తన వ్యక్తిగత ఫొటోలను తనుజ్కు షేర్ చేసిందని, 2016లో వారిద్దరూ విడిపోయారని పోలీసులు చెప్పారు.
2013 వరకు అక్షర ఐఫోన్-6 ఉపయోగించారు. 2013లో ఆమె తన వ్యక్తిగత ఫొటోలను తనుజ్కు షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని వర్సోవా పోలీసు స్టేషన్ సీనియర్ అధికారి మీడియాతో అన్నారు.
కాగా.. తనపై వస్తున్న ఆరోపణలను తనుజ్ ఖండించాడు. ముంబై పోలీసులు ఇంతవరకు తనను కలవలేదని తెలిపాడు. ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమని, తన దగ్గర అలాంటి ఫొటోలు లేవని చెప్పాడు. అక్షర తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని వెల్లడించాడు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు.
అక్షరహాసన్తో తాను నాలుగేళ్లపాటు డేటింగ్లో ఉన్నానని నటుడు తనూజ్ వీర్వాణి తెలిపారు. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని ఆయన అన్నారు. అంతేకాకుండా 2018లో అక్షరహాసన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీక్ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు.
ఫొటోలు లీక్ విషయంతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న తనూజ్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
డేటింగ్లో ఉన్న అమ్మాయి గురించి బయటకు చెప్పడం నాకస్సలు నచ్చదు. ఎందుకంటే, వృత్తిపరంగా అందరూ నన్ను గుర్తించాలి తప్ప నా వ్యక్తిగత విషయాల వల్ల కాదు. కానీ, సమయం వచ్చింది కాబట్టి ఈరోజు చెబుతున్నాను.
అక్షర-నేనూ నాలుగేళ్లు డేటింగ్లో ఉన్నాం. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం మేమిద్దరం విడిపోయాం. ఆ తర్వాత కూడా చాలాసార్లు కలిశాం. పార్టీలకు వెళ్లాం. అలా మేమిద్దరం స్నేహితులమయ్యాం. తన బాయ్ఫ్రెండ్ని కూడా అక్షర నాకు పరిచయం చేసింది. అలాగే నేనూ నా గర్ల్ఫ్రెండ్ని తనకి చూపించాను. అని తనూజ్ చెప్పాడు.
2018లో తన ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీకైన సమయంలో అక్షర మొదట నాకే ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పింది. 2013 నాటి తన ఫొటోలు ఆన్లైన్లో లీక్ కావడం గురించి నాకేమైనా తెలుసేమోనని ఆరా తీసింది. అసలు ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టాలని మేమిద్దరం ఎంతో ప్రయత్నించాం.
అక్షరకు జరిగినట్లు ఏ అమ్మాయికీ జరగకూడదు. అయితే, అక్షరహాసన్ ప్రైవేట్ చిత్రాలను నేనే బయటపెట్టానని చాలా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇదే విషయం గురించి ఆమెతో మాట్లాడగా.. ‘నాకు నీపై నమ్మకం ఉంది. నువ్వు ఇలా చేసి ఉండవు’ అని సమాధానమిచ్చింది.
వ్యక్తిగతంగా నా ఎదుట ఆ సమాధానం చెప్పినప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం ఒక్క ప్రకటన కూడా విడుదల చేసి.. నా తప్పులేదని చెప్పలేకపోయింది. ఆ విషయంలో ఎంతో బాధపడ్డాను. అప్పుడే తనకి దూరంగా వచ్చేశాను. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నమ్ముతున్నాను.’’ అని తనూజ్ వీర్వాణి వివరించారు.
దేశమంతా #MeToo ఉద్యమం సాగుతున్నా.. ఇంకా కొంతమంది తనలాంటి యువతుల ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అక్షర వాపోయింది. ‘ఈ మధ్య నా ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలియదు. కానీ, తప్పుడు బుద్ధితోనే ఇదంతా చేశారని అర్థమవుతుంది’ అని అక్షర పేర్కొంది.
తన అభ్యంతరకర ఫొటోలను షేర్ చేసుకుంటూ వాటిని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఈ వేధింపుల్లో భాగస్వాములే అని అక్షర రాసుకొచ్చింది. పనిలో పనిగా మీడియాపై కూడా మండిపడింది. ఎవరో బుద్ధిలేనివారు నీచపు పని చేస్తే.. మీడియా కూడా ఆ ఫొటోలను ఎలా ప్రచురిస్తుందని, ఆడపిల్ల మనోవేదనను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
‘తప్పకుండా ఆ వ్యక్తుల ఆచూకీ లభిస్తుంది. అప్పటి వరకు మీరు బతకండి. నన్నూ గౌరవంగా బతకనివ్వండి. ఇప్పటికైనా ఇంటర్నెట్ నన్ను మరింత వేధించదని భావిస్తున్నా. #MeToo’ అని అక్షర ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ను అక్షర సోదరి, నటి శృతిహాసన్ రీట్వీట్ చేసింది.
తనూజ్ ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్గా వెలిగిన నటి రతీఅగ్నిహోత్రి పుత్రుడు. అతను, అక్షరహాసన్ 2013లోనే ప్రేమలో మునిగిపోయారు. అలా ఐదేళ్ల పాటు సాగిన ఈ సంచలన జంట ప్రేమ 2017లో బ్రేకప్ అనే మూడక్షరాల పదంతో ముగిసింది.
Akshara Haasan