ఎంపీ వ్యాఖ్యలపై సుశాంత్ ఫ్యామిలీ కౌంటర్.. 9 పేజీల లేఖ!
సుశాంత్ నటుడిగా ఎదగాలని 10 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. కానీ ఇప్పుడేమైంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పేరు ప్రస్థావించకపోయినా సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన కేసు విచారణ విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ వివాదంలో బీహార్ పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఆయనకు కౌంటర్గా సుశాంత్ కుటుంబ సభ్యులు సుధీర్ఘ సందేశాన్ని విడుదల చేశారు. 9 పేజీల లెటర్ను రిలీజ్ చేసిన సుశాంత్ ఫ్యామిలీ అందులో తమ ఫ్యామిలీ ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.
ఓ మారు మూలు గ్రామంలో ఉండే సుశాంత్ కుటుంబం పిల్లల చదువు కోసం సిటీకి రావటం దగ్గర నుంచే లెటర్ ప్రారంభించారు. హిందీలో రాసిన ఈ లెటర్లో సుశాంత్ తల్లిదండ్రులు, అక్కచెల్లెల గురించి వారి ఎదుగుదల గురించి, వివరించారు. తాము పిల్లలకు జీవితంలో ఎలా పోరాడాలి, ఎలా సమస్యలకు ఎదురు నిలబడాలి అన్న విషయాలను ఎలా నేర్పించారు అన్న విషయాలను కూడా వివరించారు.
అంతేకాదు తల్లి మరణం తరువాత సుశాంత్, ఆయన సిస్టర్స్తో కలిసి తీసుకున్న నిర్ణయం గురించి కూడా వివరించారు. ఎంతో ప్రేమించిన తల్లి మరణించిన తరువాత, ఎప్పుడూ ఆమె లేదన్న మాట అనకూడదని నిర్ణయించుకున్నారు. ఏ రోజుకైనా తల్లి గర్వపడే స్థాయికి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని సుశాంత్ నిర్ణయించుకున్నాడని తెలిపారు.
సుశాంత్ నటుడిగా ఎదగాలని 10 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. కానీ ఇప్పుడేమైంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పేరు ప్రస్థావించకపోయినా సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన కేసు విచారణ విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు.