తమన్నాను ఆటపట్టిస్తున్న మహేష్ బాబు.. వైరల్ ఫోటోస్..
తమన్నాను సరదాగా ఆటపట్టిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేంటి మహేష్ బాబు తమ్మూని ఆటపట్టించడం ఏంటీ..? అసలు వీరిద్దరు ఏ సినిమాలో నటిస్తున్నారు అనే కదా మీ డౌట్..?
మహేష్ బాబు - తమన్నా.. వీరిద్దరి కాంబినేషన్ లో ఆగడుసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ అవ్వకపోయినా.. ఈ ఇద్దరు జంట మాత్రం సూపర్ గా ఉంటుంది. వీరి సీన్లు కూడా వర్కౌట్ అయ్యాయి. ఇక లాంగ్ గ్యాప్ తరువాత వీరిద్దరు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులేశారు.. ఇక ముచ్చటగా మూడోసారి ఈ స్టార్స్ కలిసి సందడి చేయబోతున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkxhkhg47xgajh7av8yd3j57/gdfa-aaaqaawu7x-jpg_300x400xt.jpg)
టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన ముంబై భామల్లో తమన్నా కూడా ఒకరు. ఇప్పటికీ యమా యాక్టీవ్ గా సినిమాలు చేస్తుంది బ్యూటీ. మల్క్ బ్యూటీగా కుర్రాళ్ళ హుదయాలు కొల్లగొట్టిన ఈభామ.. ఆల్ మోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న తమన్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి తాజాగా మరోసారి సందడి చేసింది.
ఈ క్రేజీ స్టార్ యాక్టర్లు మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించే సరికి అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు తమన్నాను ఏదో ఆటపట్టిస్తూ.. సరదాగా ఇద్దరు నవ్వుకుంటూకనిపించారు. ఈ సంఘటన ఫోటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి. మహేశ్ బాబు, తమన్నా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏ సినిమా చేస్తున్నారనే కదా మీ డౌటు.
వీరిద్దరూ షూట్లో పాల్గొన్నారు అన్నది నిజమే.. కానీ సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం వీరిద్దరు కలిశారు. యాడ్ షూట్ లో భాగంగా ఒక చోట చేరిన ఈ తారలు.. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇక వీరిద్దరి వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ప్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
తమన్నా మరోసారి సూపర్ క్యూట్గా మెస్మరైజింగ్ లుక్తో అదరగొట్టేస్తుండగా.. మహేశ్ బాబు ఎప్పటిలాగా తన చిరునవ్వుతో అందరినీ కట్టిపడేస్తున్నాడు. తమన్నా, మహేశ్ యాడ్ షూటింగ్ ఫొటోలు ఇప్పుడు మూవీ లవర్స్ మనసు దోచేస్తున్నాయి.
Guntur Kaaram Review
ఇక ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈరోజు అంటే జనవరి 12న ప్రంపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈమూవీని టాలీవుడ్ మాటల మాత్రికుడు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరెక్కించారు.