#PawanKalyan :హరీష్ శంకర్ మార్చిన కథ ఇదీ, ఫ్యాన్స్ కంగారు పడక్కర్లేదు,పూర్తి రీమేక్ కాదు?
‘పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈసారి వినోదానికి మించినది. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
ప్రము ఖ దర్శకుడు హరీష్ శంకర్.... హరీష్ శంకర్ తన తాజా సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తను గతంలో ప్రకటించిన సినిమా టైటిల్ ని మారుస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కింద మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే ఈ సారి ఎంటర్టైన్మెంట్ కి మించి అని కూడా పోస్టర్ పై వేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ఈ పోస్టర్ లో పవన్ బైక్ కి ఆనుకొని స్టైల్ గా నిల్చున్న స్టైల్ తో అదరకొడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తేరి రీమేక్..అవునా కాదో అనే మ్యాటర్ మాత్రం తేలటం లేదు. మరో ప్రక్క త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవుతుందని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. అలాగే ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ కు సభందించిన ఓఅంశం బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు ... ఈ సినిమా పూర్తి స్థాయి రీమేక్ కాకుండా ఇటు ఒరిజినల్ కాకుండా సరికొత్త మార్పులతో రానున్నదని తెలుస్తోంది. తేరి చిత్రానికి, ‘భవదీయుడు భగత్ సింగ్’స్క్రిప్టు ఫస్టాఫ్ కలిపి ఈ స్క్రిప్టు రెడీ చేసారని తెలుస్తోంది. ఈ స్క్రిప్టు సరికొత్తగా ఉందని, తేరిలోని ఎమోషన్ ని, కొన్ని యాక్షన్ బ్లాక్స్ మాత్రమే ఈ కథలో ఉపయోగించబోతున్నట్లు సమాచారం.
అలాగే తేరీ లో విజయ్ చేసిన బేకరీ ఓనర్ క్యారెక్టర్ ని హరీష్ సొంతగా రాసుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’స్క్రిప్టు లోని కాలేజీ లెక్చరర్ రోల్ తో రీప్లేస్ చేస్తున్నారు. దాంతో ఫస్టాఫ్ ఫన్ తో కొద్ది పాటి యాక్షన్ తో నిండి ఉంటుందని, సెకండాఫ్ మాత్రం పూర్తిగా థేరి లా సాగుతుందని చెప్తున్నారు. అయితే సెకండాఫ్ లోనూ హరీష్ శంకర్ స్టైల్ లో మార్పులు, చేర్పులు ఉండబోతున్నట్లు చెప్తున్నారు. గబ్బర్ సింగ్ తరహాలో ఈ చిత్రం భారీగా వర్కవుట్ అవుతుందని చెప్తున్నారు. అందుకే ‘భవదీయుడు భగత్ సింగ్’ లో భగత్ సింగ్ ని తీసుకుని పోలీస్ లోని యాక్షన్ ని గుర్తు చేసేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పెట్టారని వినిపిస్తోంది.
Pawan kalyan
ఈ చిత్రానికి ‘మనల్ని ఎవడ్రా ఆపేది...’ అనే ట్యాగ్లైన్. అంతేకాకుండా.. ‘ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అని పోస్టర్ మీద రాసుకొచ్చారు. ఆ పోస్ట్కి ‘పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈసారి వినోదానికి మించినది. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రం ఇదే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూనే.. వరుస సినిమాలలో సినీ కెరీర్లోనూ దూసుకెళుతున్నారు. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. ఇటీవలే ‘సాహో’ దర్శకుడు సుజీత్ (Sahoo Sujeeth) కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చింది.
ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాని గతంలో అనౌన్స్ చేశారు. పవన్ రాజకీయాల షెడ్యూల్స్ వల్ల, హరిహర వీరమల్లు సినిమా ఉండటం వల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. దాంతో ఇప్పుడు పవన్ సలహాలో ఈ మార్పులు చేసారు.
మరో ప్రక్క ఈ సినిమా తమిళ్ తేరి రీమేక్ అని వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ రీమేక్ అయితే చేయొద్దంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అది కూడా దృష్టిలో పెట్టుకునే కథలో మార్పులు చేసినట్లు సమాచారం. గత రెండు రోజులుగా మాత్రం హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటినుంచో పెండింగ్ సినిమా మొత్తానికి షూటింగ్ మొదలెట్టనున్నారు .
ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంపై ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో పదేండ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఆడియెన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ కానుంది. ఖచ్చితంగా మాస్ మసాలా చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ లాంటి మాస్ కంటెంట్ సినిమా తర్వాత డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కాంబినేషనల్ లో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat singh). ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని సమాచారం. సెట్స్ పైకి వెళ్లేందుకు చిత్ర యూనిట్ కూడా సిద్ధంగా ఉంది. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం అంటున్నారు.