విడిపోతున్న స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి?.. సోషల్ మీడియాలో దుమారం..
తెలుగు చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. తాజాగా సెలబ్రిటీ జంట విడిపోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో కలకలం రేపుతున్నాయి.
టాలీవుడ్లో స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి. పాటల కార్యక్రమాల్లో పాల్గొంటూ సింగర్స్ గా ఎదిగిన వీరిద్దరికి `సరిగమప` మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో హేమచంద్ర రన్నరప్గా నిలవడం విశేషం. అక్కడ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగర్స్ గా ఎదుగుతున్న క్రమంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే రంగంలో ఉండటంతో మరింత దగ్గరయ్యారు. దీంతో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2012డిసెంబర్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా, 2013 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది.
ఈ సింగర్స్ జంట చాలా కాలంగా మంచి అనోన్య జంటగా పేరుతెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి అనేక షోస్లోనూ పాల్గొంటూ వేదికలపై సందడి చేస్తుంటారు. పాటల కార్యక్రమాలతోపాటు ఇతర ఎంటర్టైన్మెంట్స్ షోస్లోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు. ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. టాలీవుడ్లో యంగర్జనరేషన్లో టాప్ సింగర్స్ గా రాణిస్తున్నారీ జంట.
ఇదిలా ఉంటే తాజాగా వీరికి సంబంధించి ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ స్టార్ సింగర్స్ విడిపోతున్నట్టు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా ఈ ఇద్దరు విడిపోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్కి బ్రేకప్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఇద్దరికి పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో డైవర్స్ తీసుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. అయితే హేమచంద్ర, భార్గవి సన్నిహితుల నుంచి మాత్రం అది నిజం కాదని తెలుస్తుంది. మరి ఏది నిజమనేది సస్పెన్స్ గా మారింది. నిప్పు లేనిదో పొగరాదనే సామేతని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల నాగచైతన్య, సమంత విషయంలో ఇలాంటి రూమర్సే వచ్చాయి. చివరికి వాళ్లు వినిపోయారు. అలాగే ధనుష్, ఐశ్వర్య ధనుష్ సైతం విడిపోతున్నట్టు చెప్పి షాకిచ్చారు. మరోవైపు బాలీవుడ్ అమీర్ ఖాన్, కిరణ్ రావులు విడిగా ఉండాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హేమచంద్ర, శ్రావణ భార్గవిల విషయంలో రూమర్స్ లోనూ నిజమే ఉందంటున్నారు. మరి ఏది నిజమనేది తేలాలంటే వాళ్లు స్పందించాల్సిందే.