తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, రకుల్, శ్రియా, సుస్మితా, తాప్సీ.. స్టార్ బ్యూటీస్ సైడ్ బిజినెస్ చూశారా?
స్టార్ హీరోయిన్లు తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, రకుల్, శ్రియా, తాప్సీ, శిల్పా శెట్టి, సుస్మితా సేన్ హీరోయిన్లుగా ఊపేయడం మాత్రమే కాదు, వీరు బిజినెస్ల్లోనూ టాప్లోనే ఉన్నారు. వీళ్ల సైడ్ బిజినెస్లేంటో తెలుసా?
హీరోయిన్లు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వేస్ట్ చేయకుండా వ్యాపారాల్లో పెడుతూ డబుల్ ఇన్కమ్ పొందుతున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. హీరోలకు ధీటుగా తమ వ్యాపారాలను బిల్డ్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లు మాత్రమే కాదు, బిజినెస్ఉమెన్లుగానూ రాణిస్తున్నారు. సినిమాల్లో రాణించలేని స్థితిలోనూ ఇలా బిజినెస్లు చూసుకుంటూ హాయిగా లైఫ్ని లీడ్ చేయబోతున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నగల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆమెకి `వైట్ అండ్ గోల్డ్` పేరుతో సొంతంగా ఓ బ్రాండెడ్ అభరణాల షోరూమ్ ఉంది.
పెళ్లి తర్వాత హాట్ బ్యూటీగా మారిన కాజల్ `మార్సాలా` పేరుతో బ్రాండెడ్ నగల వ్యాపారం ఉంది. ఈ అభరణాలను ఇప్పుడు చెల్లి నిషా అగర్వాల్ చూసుకుంటుంది. దీంతోపాటు పెళ్లి తర్వాత సోఫా దిండ్ల వ్యాపారం స్టార్ట్ చేసింది.
సమంత స్టార్ హీరోయిన్గా రాణించడమే కాదు, బిజినెస్లోనూ తన మార్క్ ని చూపిస్తుంది.ఈ అమ్మడు గతేడాది `సాకి` పేరుతో లేడీస్కి సంబంధించిన ఫ్యాషన్ డ్రెసెస్ని విక్రయిస్తుంది. అలాగే చిన్నపిల్లలకు ప్లే స్కూల్ కూడా ఏర్పాటు చేసింది.
గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాషన్పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఓ ఫ్యాషన్ డ్రెసెస్కి సంబంధించిన ఓ షోరూమ్ని ప్రారంభించింది.
రకుల్ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టింది. ఆమె `ఎఫ్ 45`పేరుతో హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఫిట్నెస్ సెంటర్లని ఏర్పాటు చేసింది.
శ్రియా ముంబయిలో బ్యూటీ పార్లర్ని, స్పా సెంటర్ని నడిపిస్తుంది. మరికొన్ని చోట్లకి దీన్ని విస్తరించబోతుంది.
`జెర్సీ` భామ శ్రద్ధా శ్రీనాత్ `పర్ సే` పేరుతో ఓ రెస్టారెంట్ని ప్రారంభించింది. ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఫుడ్ని, సలాడ్లని తన హోటల్ ద్వారా అందిస్తుంది.
ఇటీవల సీక్రెట్గా పెల్లి చేసుకున్న ప్రణీత సుభాష్ కూడా బిజినెస్లో ఉంది. ఆమె చాలా రోజుల క్రితమే `బూట్ లెగ్గర్` పేరుతో బెంగుళూర్లో ఓ రెస్టారెంట్ని ప్రారంభించింది.
తాప్సీ `వెడ్డింగ్ ఫ్యాక్టరీ` పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ని ప్రారంభించింది.
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ దుబాయ్లో జ్యూవెలరీ షాప్ని నిర్వహిస్తుంది. బాగా సంపాదిస్తుంది.
మరో బాలీవుడ్ భామ, సాగర కన్య శిల్పా శెట్టి యోగా సెంటర్లని నడిపిస్తుంది. తాను స్వయంగా యోగా ట్రైనర్గా ఉండటం విశేషం.