పవన్ కళ్యాణ్ బయోపిక్.. మళ్లీ గెలికిన శ్రీరెడ్డి!
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఫోస్ బుక్లో ఓ మీమ్ను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. గతంలో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్, శ్రీరెడ్డి మధ్య పెద్ద యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డిల మధ్య వివాదం ఇప్పటిది కాదు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం మొదలు పెట్టిన సమయంలోనే వీరిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. అప్పట్లో పవన్ ను ఉద్దేశిస్తూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.
సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు రెచ్చిపోయారు. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. పవన్ను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్లో ఫేస్బుక్ పోస్టులు పెట్టింది. ఈ యుద్ధం చాలా రోజుల పాటు కొనసాగింది. పవన్ కూడా శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిలిం ఛాంబర్లో హడావిడి చేసేదాకా వచ్చింది వ్యవహారం.
ఆ తరువాత కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. పవన్ పొలిటికల్ కామెంట్స్ కు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు జగన్ మద్దతుగా పవన్ మీద ఓ రేంజ్ లో రెచ్చిపోయిన కామెంట్స్ చేసింది.
పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పెళ్లిల్లు, ఇతర పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదిక ప్రస్తావించి రచ్చ చేసింది శ్రీరెడ్డి. అయితే కొద్ది రోజులుగా పవన్ జోలికి వెళ్లని శ్రీరెడ్డి తాజాగా మరోసారి ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ బయోపిక్ నేపథ్యంలో తయారు చేసిన ఓ మీమ్ను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. `హీరో ఇంట్రక్షన్ ఫాం హౌస్ లో ధడ ధడ ధడ. ఫస్ట్ హాఫ్ 3 మ్యారేజెస్తో 4 గే డ్యాన్సులతో కళ కళ కళ, ఇంటర్వెల్ మాస్ డైలాగ్స్ ఇది నా లాస్ట్ సినిమా.. 2019 సీఎం నేనే. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ నా దగ్గర డబ్బులు లేవు సినిమాలు చేసుకుంటా` అంటూ ఉన్న మీమ్ను షేర్ చేసింది.
గతంలో పవన్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మరోసారి ఇలాంటి పోస్ట్ను చేయటంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చాలా రోజుల తరువాత పవన్పై పోస్ట్ పెట్టి శ్రీరెడ్డికి ఎలాంటి రిప్లైస్ వస్తాయో చూడాలి.