శ్రీలీల సంచలన నిర్ణయం, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ..?
టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రీలీల. దాదాపు డజన్ సినిమాలు వెనకేసుకున్నఇ ఈ బ్యూటీ.. ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉండగా.. షూటింగ్స్ రన్నింగ్ లో ఉండగానే శ్రీలీల ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకుంటున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది.
సునామీలా టాలీవుడ లోకి ఎంటర్ అయ్యింది శ్రీలీల. చేసిన ఫస్ట్ సినిమా ప్లాప్ అయినా.. తన యాక్టీంగ్ తో... అందంతో అందరిని ఆకర్షించింది. అంతే కాదు వరుస ఆపఱ్లు సాధించి.. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. ఇక అంతటితో ఆగకుండా.. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతీ శెట్టిలాంటి హీరోయిన్ల ఆఫర్లు కూడా తనఖాతాలో వేసుకుంది శ్రీలీల.
ఇక ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తోంది బ్యూటీ. కృతీ శెట్టికి మాదిరిగానే ఆమె కెరీర్ కూడా ప్రమాదంలో పడిపోతుందా అన్నఅనుమానం ఫ్యాన్స కు కలుగుతుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరి హవా నడుస్తోంది. శ్రీలీల ఒక వైపు అయితే.. మృణాల్ ఠాకూర్ మరోవైపు దున్నేస్తున్నారు ఇండస్ట్రీని.
ఇక శ్రీలీలకు కెరీర్ పై హోప్స్ ఇచ్చే సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమా చేస్తోంది బ్యూటీ. ముందుగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసినా.. ఆతరువాత ఆమె అనుకోని.. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. దాంతో అసలు ఛాన్స్ కొసరుగా అనుకున్న శ్రీలీలకుదక్కింది. దాంతో శ్రీలీల ఫుల్ జోష్ మీద ఉంది. కెరీర్ మీద హోప్ తో ఉంది.
శ్రీలీల ఖాతాలో ఉన్న ఎన్ని సినిమాలు ప్లాప్అయినా.. మహేష్ మూవీ ఒక్కటి వర్కౌట్ అయినా చాలు ఆమె ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోడానికి. అయితే ఈక్రమంలో శ్రీలీల తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇస్తుంది. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిందట ఈ బ్యూటీ. కొన్నాళ్లు ఇటు వైపు రాకుండా జాగ్రత్తలుపడుతోందట.
ఇందుకు కారణం ఏంటీ అంటే.. శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. స్టడీస్ చేస్తూనే.. ఆమె సినిమాలు కంటీన్యూ చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీలీలకు ఎగ్జామ్స్ ఉండంతో .. అన్ని సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి.. చదువుపై దృష్టి పెట్టిందట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అఫీషియల్ గా ఈ విషయంపై ఎవరూ మాట్లాడకపోయినా.. నెట్టింట్లో మాత్రం ఫుల్ గా ట్రెండ్ అవుతోంది.
ఇలా యాక్టర్లుగా ఉండి డాక్టర్లు చదివిన వారు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. రీసెంట్ గానే హీరోయిన్ సాయి పల్లవి డాక్టర్ పట్టా అందుకున్నారు. ఆమెకూడా నటిస్తూనే తన చదువు కంప్లీట్ చేశారు.