వాళ్ళకు పనిలేదంటూ.. సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు!
సింగర్ సునీత రెండో వివాహం చేసుకోగా సోషల్ మీడియాలో కొందరు విమర్శల దాడికి దిగారు. పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా... 42ఏళ్ల వయసులో రెండో వివాహం ఏమిటని ఆరోపణలు చేశారు.
కుటుంబ సభ్యులు, పిల్లల అనుమతితోనే ఈ పెళ్ళికి సిద్దమైనట్లు ముందుగానే తెలియజేసిన సునీత, ఎటువంటి విమర్శలను పట్టించుకోలేదు. మాంగో మీడియా అధినేత రామ్ ని ఆమె గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.
ఇక వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ సునీత పెళ్లిపై దారుణమైన కామెంట్స్ చేయడంతో పాటు, సునీత రెండో వివాహాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కత్తి మహేష్ విమర్శలు ఎదుర్కోవడం జరిగింది.
కాగా ఈ విషయంపై ఎమ్మెల్యే రోజా కొంచెం ఘాటుగానే స్పందించారు. సునీత రెండో వివాహాన్ని విమర్శిస్తున్న వారికి ఆమె చివాట్లు పెట్టారు.
జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సునీత రెండో వివాహం చేసుకుంటే తప్పేంటని ఆమె సమర్ధించారు. సునీత వివాహానికి కుటుంబ సభ్యులు, పిల్లలే అనుమతి తెలుపగా విమర్శించడానికి మీరెవరు అన్నారు.
సింగర్ సునీత పెళ్లిపై కొందరు వెధవలు పనిగట్టుకొని కామెంట్స్ చేస్తున్నారని, రోజా కౌంటర్ విసిరారు. ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటుంది. రెండో పెళ్లి నిర్ణయం సునీత వ్యక్తిగత విషయం.. దానిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆమె ఘాటు సమాధానం చెప్పారు.
సింగర్ సునీతకు మద్దతుగా నిలిచిన రోజాను చాలా మంది అభినందిస్తున్నారు. రోజా కరెక్ట్ గా మాట్లాడారని తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజుతో విడిపోయిన సునీత జనవరి 9న రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.