అక్క తర్వాత నేను పుట్టా.. నాన్న నా ముఖం కూడా చూడలేదుః కూతురు ముందే రేణు దేశాయ్ కన్నీళ్లు
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కన్నీళ్లు పెట్టుకుంది. తమ కుటుంబంలో జరిగిన ఘటనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కూతురు ముందే ఏడ్చేసింది. సింగర్ సునీత సైతం ఎమోషనల్ అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయన్నుంచి విడాకులు పొందిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉంది. ఇటీవల తిరిగి మీడియా ముందుకొస్తూ తన బాధని, స్ట్రగుల్స్ ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది.
అదే సమయంలో కెరీర్ పరంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె జీ తెలుగులో `డ్రామా జూనియర్స్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. త్వరలో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో పవన్, రేణుల కూతురు ఆద్య గెస్ట్ గా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఆద్య రాకని వర్ణిస్తూ నువ్వు ఈ రోజుని ఎప్పటికీ బిగ్ డేగా మార్చావని చెబుతో ఎమోషనల్ అయ్యింది రేణు దేశాయ్. దీనికి ఆద్య స్పందిస్తూ, `మమ్మీ ఈజ్ బెస్ట్ మామ్ ఎవర్ అంటూ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.
అనంతరం తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు. ఇందులో మదర్స్ డే సందర్భంగా మదర్ స్కిట్ని ప్రదర్శించారు. ఆడపిల్ల పుట్టిందని చులకని చేయడం, తిట్టడం చేస్తుంటారు ఆ స్కిట్లో. దీంతో రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యింది.
తన జీవితంలోని విషయాన్ని పంచుకుంది. తమ పేరెంట్స్ కి తామిద్దరం కూతుళ్లమని చెప్పింది. వాళ్ల నాన్న తమని ఎంత చులకనగా, భారంగా భావించారో పంచుకుంది రేణు దేశాయ్.
`మొదట అక్క పుట్టింది. ఆ తర్వాత నేను పుట్టాను. మళ్లీ ఆడపిల్లా అని.. మా నాన్న కొన్నాళ్లపాటు నా ముఖం కూడా చూడలేదు` అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. పక్కన తన కూతురు ముందే కంటతడి పెట్టింది రేణు. ఆద్య రేణుని ఓదార్చే ప్రయత్నం చేసింది.
దీంతో సింగర్ సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడ షోలో ఉన్న వారంతా ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. హల్చల్చేస్తుంది. మహిళలను సమాజంలో ఎంత తక్కువగా, చులకనగా, భారంగా చూస్తున్నారో తెలియజేసిందీ ప్రోమో.