మరో సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టిన మాస్ మహారాజా
రవితేజ జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. తాజాగా మరో సినిమాని ట్రాక్ ఎక్కించినట్టు తెలుస్తుంది.
రవితేజ నటించిన `రాజా ది గ్రేట్` తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. దాదాపు మూడేళ్ళు అవుతుంది.
`టచ్ చేసి చూడు`, `నేల టికెట్టు`, `అమర్ అక్బర్ ఆంటోని`, `డిస్కోరాజా` చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న రవితేజ.. నెక్ట్స్ `రాక్షసన్` ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో సినిమాని లైన్లో పెట్టినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి.
ఇదిలా ఉంటేతాజాగా మారుతి డైరెక్షన్లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మాస్, క్లాస్కి ఆకట్టుకునే కథాంశాలతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు మారుతి. సింపుల్గా హిట్లని తనఖాతాలో వేసుకుంటున్నారు. చివరగా `ప్రతి రోజూ పండగే` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు జీఏ2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న తన నెక్స్ సినిమాని రవితేజతో చేయాలని భావిస్తున్నారు. అంతకు ముందు వరుణ్ తేజ్, రామ్ పేర్లు వినిపించినా, ఫైనల్గా మాస్ మహారాజా ఓకే చేశారని టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాని డిసెంబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
మరి వరుసగా ఫెయిల్యూర్లో ఉన్న రవితేజకి ఈ సినిమాలైన హిట్ అందించి ఆయనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయేమో చూడాలి.