`ఉప్పెన` సాంగ్కి డ్యుయెట్ పాడుకున్న రష్మీ, సుధీర్, దీపికా, హైపర్ ఆది.. ఏకంగా బోట్లోనే కానిచ్చేశారుగా
`ఢీ` జోడీస్ రష్మీ, సుడిగాలి సుధీర్, అలాగే హైపర్ ఆది, దీపికా పిల్లి వేదికపైనే రొమాన్స్ షురూ చేశారు. ప్రియమణి చూస్తుండగానే హగ్గులతో రెచ్చిపోయారు. అంతేకాదు పడవలోనే ... ఆ పని కానిచ్చేశారు సుడిగాలి సుధీర్, రష్మీ. దీంతో ప్రియమణితోపాటు యాంకర్ ప్రదీప్ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
`ఢీ`లో కింగ్స్, క్వీన్స్ టీమ్ లీడర్స్ గా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ గౌతమ్, దీపికా పిల్లి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వేదికలపై కూడా రష్మీ- సుధీర్, దీపికా పిల్లి- హైపర్ ఆది ఒకరినొకరు పులిహోరలు కలుపుకుంటున్నారు. ఒకరిని పడేసేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా వీరి మధ్య రొమాన్స్ పీక్లోకి వెళ్లింది. కంటెస్టెంట్స్, డాన్సర్లు, ప్రియమణి, పూర్ణ వంటి జడ్జెస్ చూస్తుండగానే డ్యుయెట్ పాడుకున్నారు వీరి రెండు జంటలు.
ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన `ఉప్పెన` చిత్రంలోని `జల జల.. జలపాతం` సాంగ్కి `ఢీ` వేదికపై బహిరంగ రొమాన్స్ కి తెరలేపారు. సినిమాల్లో సముద్రంలో హీరోహీరోయిన్లు ఘాటు రొమాన్స్ లో మునిగిపోయినట్టుగా.. రష్మీ,సుధీర్, హైపర్ ఆది, దీపికా పిల్లి డీప్ రొమాన్స్ లోకి వెళ్లిపోయారు.
రష్మీ, దీపికా పిల్లిలకు హగ్లు, టచ్లు ఇస్తూ రెచ్చిపోయారు. నిజమైన రొమాన్స్ ఇదే అనేలా రెచ్చిపోయారు. కెమిస్ట్రీ కి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు.
ఈ రెండు జంటలు పడవపై డ్యూయెట్లు పాడుకోవడం విశేషం. దీన్ని చూస్తే షోలో ఉన్న వారంతా ముక్కున వేలేసుకోవడం విశేషం. అంతటితో ఆగలేదు హద్దులు దాటేశారు.
రష్మీ,సుడిగాలి సుధీర్ అయితే ఒక్క అడుగు ముందుకేసి అందరు చూస్తుండగానే పడవలోకి ఎవరికి కనిపించకుండా జారుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఊహించుకోవచ్చు.
`ఢీ` డాన్స్ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో ఈ సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. సుడిగాలి సుధీర్, రష్మీ, అలాగే హైపర్ ఆది, దీపికా పిల్లి ఇంతగా తెగించి మరీ ఇలా రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో వైరల్ అవుతుంది.