బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ రణ్-దీప్లకు సక్సెస్ఫుల్గా రెండేళ్లు
బాలీవుడ్లో రొమాంటిక్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె అని చెప్పాలి. వీరి జోడీకి ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ కపుల్ మ్యారేజ్ చేసుకుని రెండేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు విషెస్ తెలిపారు.
బాలీవుడ్లో దీపికా పదుకొనె స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గానూ నిలుస్తుంది. మరోవైపు రణ్వీర్ సింగ్ సైతం క్రేజీ స్టార్గా రాణిస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.
2008లో వచ్చిన `బచ్చా హే హసినో` చిత్రంలో రణ్బీర్ కపూర్తో కలిసి నటించిన దీపికా ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. కానీ తక్కువ సమయంలోనే బ్రేకప్ చెప్పకుంది. చాలా రోజులు సింగిల్గానే ఉన్న దీపికా `రామ్లీలా` చిత్రంతో రణ్వీర్ సింగ్కి ఆకర్షితురాలైంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన `రామ్లీల` చిత్రంలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అటు వెండితెరపై, ఇటు రియల్ లైఫ్లోనూ కెమిస్ట్రీ కుదరడంతో ఇద్దరూ ప్రేమ పడ్డారు.
వరుసగా `బాజీరావ్ మస్తానీ`, `పద్మావతి` చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. చాలా రోజు డేటింగ్ చేశారు. బాలీవుడ్ హాట్ లవ్ కపుల్గా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అది పెళ్ళికి దారి తీసింది.
2018లో నవంబర్ 14,15 తేదీల్లో అంగరంగ వైభవంగా, చాలా గ్రాండియర్ వేలో వీరి వివాహం జరిగింది. సింధూ, కొంకణి సంప్రాదాయల ప్రకారం వీరి మ్యారేజ్ చేసుకున్నారు. అప్పట్లో చర్చనీయాంశంగా మారిందీ ఈ క్రేజీ కపుల్ మ్యారేజ్ ఈవెంట్.
తాజాగా మ్యారేజ్ చేసుకుని వీరు విజయవంతంగా రెండేళ్లు వివాహ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీలో ఓ కొలనులో ఫోటోలకు పోజులిచ్చారు. సోల్ మేట్లపై ఇద్దరూ ప్రశంసలు కురిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు ప్రస్తుతం దీపికా `83`తో రణ్వీర్ సింగ్తో కలిసి నటిస్తుంది. దీంతోపాటు శకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. రణ్వీర్ సింగ్ `83`తోపాటు `జయేష్భాయ్ జోర్దార్` చిత్రంలో, అలాగే `సూర్యవంశీ`లో గెస్ట్ గా కనిపించబోతున్నారు.