రామ్చరణ్ స్పెషల్గా కర్రీ చేయించాడంటోన్న అనసూయ..దొండపండులాంటి పెదాలతో ఎర్రగులాబీలా మెరిసోతుందిగా!
అనసూయ ఎర్రగులాబీలా మెరిసిపోతుంది. గ్లామర్ ఓవర్ డోస్ అనేలా దొండపండులాంటి పెదాలతో, ఎర్రగులాబీలా మెరిసిపోతుంది అనసూయ. అంతేకాదు తన కోసం రామ్చరణ్ స్పెషల్గా కర్రీ చేయించాడట.
అనసూయ అందానికి ఎరుపు తోడయ్యింది. ఇంకా చెప్పాలంటే అనసయ అందం ఎరుపెక్కింది. ఎర్రని దొండపండులాంటి పెదలతో, రెడ్ డ్రెస్లో ఎర్రగులాబీలా మారిపోయ్యింది అనసూయ.
`మేడే` ప్రత్యేకమో ఏమో అనసూయ రెడ్ టాప్లో హోయలు పోయింది. తాను నటిస్తున్న `థ్యాంక్యూ బ్రదర్` చిత్ర ప్రమోషన్ లో భాగంగా అనసూయ తన అందాలకు ఎరుపు అద్దింది. కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెట్టింది.
గుంటూరు మిర్చీని మించిన ఘాటు ఇప్పుడు అనసూయ అందాల్లో కనిపిస్తుండటం విశేషం. ఈ నయా పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని కనువిందు చేస్తున్నాయి.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అనసూయ. రామ్చరణ్తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్ చేసుకుంది. అంతేకాదు `రంగస్థలం` సినిమా షూటింగ్ సమయంలో చెర్రీ తనకోసం స్పెషల్గా వంటలు చేయించాడని తెలిపింది సెక్సీ యాంకర్.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన `రంగస్థలం` చిత్రంలో చరణ్ చిట్టిబాబుగా నటిస్తే, రంగమ్మత్తగా అనసూయ కనిపించింది. ఇందులో ఆమెది చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర. ఆ పాత్రలో అద్భుతమైన నటనతో మంచి ప్రశంసలందుకుంది అనసూయ.
అనసూయ తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా షూటింగ్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సెట్లో భోజన సమయంలో చేపల కూర ఉండేదని, తాను చేపల కరీ తినననే విషయాన్ని గ్రహించిన రామ్చరణ్ తనకోసం ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించారట.
`నా కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి పన్నీర్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించేవారు. అది అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేదని చెప్పింది అనసూయ. ఓ స్టార్ హీరో తన కోసం అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి మరీ చేయించడం చాలా సంతోషాన్నిచ్చింది` అని తెలిపింది అనసూయ.
అనసూయ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ హీరో. ఈ సినిమాలో సునీల్ కి భార్యగా, నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో అనసూయ కనిపించబోతుందని టాక్.