`ఆచార్య`లో సిద్ధ లుక్ లీక్.. ఎయిర్పోర్ట్ లో భార్య ఉపాసనతో చెర్రీ సందడి
రామ్చరణ్ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. తాను నటిస్తున్న `ఆచార్య` చిత్రంలోని తన పార్ట్ పూర్తి చేసుకోవడంతో తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఆయన తన భార్య ఉపాసనతో కలిసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో మెరిశారు. దీంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున్న రావడంతో ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. మరోవైపు ఇందులో చెర్రీ సిద్ధ లుక్ లీకైంది.
రామ్చరణ్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రాజమండ్రి సమీపంలోని మారెడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
దాదాపు ఇరవై రోజులుగా చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ షెడ్యూల్తో తన పార్ట్ పూర్తి చేసుకున్నారు రామ్చరణ్.
దీంతో తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి తన భార్య ఉపాసనతో కలిసి చేరుకోగా పెద్ద ఎత్తున అభిమానులు చెర్రీని కలిసేందుకు వచ్చారు.
ఓ వైపు అభిమానులు, మరోవైపు మీడియా రావడంతో ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. కోలాహలం నెలకొంది.
తాజాగా ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో తమ అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ పుష్ప గుచ్చాలు తీసుకొని వచ్చారు.
రామ్చరణ్ `ఆచార్య`లో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కామ్రేడ్ గా నటిస్తున్నారు. కాజల్ చిరు సరసన హీరోయిన్గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు రామ్చరణ్ని కలిసేందుకు ఉపాసన రెండు రోజులు క్రితమే రాజమండ్రికి చేరుకున్న విషయం తెలిసిందే.
సెట్లో రామ్చరణ్. సిద్ధ లుక్లో అదరగొడుతున్నాడు.
సెట్లో అభిమానితో రామ్చరణ్.
దీంతోపాటు చెర్రీ `ఆర్ఆర్ఆర్`లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ మరో హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు.
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో భారీగా రూపొందుతుంది. ఇది అక్టోబర్ 13న విడుదల కానుంది.
ఎయిర్పోర్ట్ లో కోలాహలం..