మొక్కలకు స్థలం లేదట.. బాల్కనీలో పెట్టుకున్న మలయాళ బ్యూటీ
తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వివిధ రాష్ట్రాలకు వ్యాపించింది. ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ దీన్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మలయాళ నటి రాజీషా విజయన్ మొక్కలు నాటింది.
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ విసిరిన ఛాలెంజ్ని స్వీకరించిన రాజీషా విజయన్ కేరళలోని తన నివాసంలో మూడు మొక్కలను పెంచుకుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆమె చెబుతూ, తనకు మొక్కలంటే చాలా ఇష్టమని, తమ ఇంట్లో ఖాళీ స్థలం లేని కారణంగా ఎంతో ఇష్టంతో పండ్ల మొక్కలను ఇంటి బాల్కనీలో పెట్టుకుంటున్నట్టు తెలిపింది. వాటిని సంరక్షించే బాధ్యత తనదే అని పేర్కొంది.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కి అభినందనలు తెలిపారు. అంతేకాదు మరో ముగ్గురిని నామినేట్ చేశారు.
టెలివిజన్ నటిగా, హోస్ట్ గా, హీరోయిన్గా రాణిస్తున్న రాజీషా విజయన్ మలయాళంలో `ఊరు సినిమాక్కరన్`, `జూన్`, `ఫైనల్స్`, `స్టాండ్ అప్` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం `లవ్`, `ఎల్లమ్ షెరియకుమ్`, `కర్ణన్`, `ఖో ఖో` వంటి చిత్రాల్లో నటిస్తుంది.