టీనేజ్ కూతుళ్లతో రజనీకాంత్, భార్య లతా.. రేర్ పిక్స్ వైరల్..
సూపర్ రజనీకాంత్ ఫ్యామిలీ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో టీనేజ్ కూతుళ్లతో ఉన్న రజనీకాంత్ అరుదైన ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సౌత్ సూపర్ స్టార్గా రాణిస్తున్న రజనీకాంత్కి ఇద్దరు కూతుళ్లున్నారు. రజనీ, లతాల సంతానంగా ఐశ్వర్య, సౌందర్య జన్మించారు. కుమారులు లేకపోయినా ఇద్దరినీ కొడుకులుగా పెంచారు రజనీకాంత్. రజనీ ఇద్దరు కూతుళ్లు మల్టీటాలెంటెడ్ కావడం విశేషం. వీరిద్దరు సినిమాల్లోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
హీరో ధనుష్ని వివాహం చేసుకున్న ఐశ్వర్య దర్శకురాలిగా, ప్లే బ్యాక్ సింగర్గా రాణిస్తున్నారు. భర్త ధనుష్తో `3`, `వెయ్ రాజా వేయ్`, `సినిమా వీరన్` చిత్రాలను రూపొందించారు. సౌందర్య కూడా దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్గా రాణిస్తున్నారు. రజనీతో ఆమె `కొచ్చడయాన్` అనే 3డీ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించారు. గ్రాఫిక్ డిజైనర్గా అనేక సినిమాలకు పనిచేశారు. సౌందర్య మొదటి భర్త అశ్విన్ రామ్కుమార్తో విడాకులు తీసుకున్నాక విషగన్ని రెండో వివాహంగా చేసుకున్నారు.
వీరంతా వేర్వేరు ఫ్యామిలీగా మారిపోయినప్పటికీ రజనీకి వెన్నంటే ఉంటున్నారీ ఇద్దరు కూతుళ్లు. చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అన్ని విషయాలో ఓ కుమారుళ్లా బాధ్యతలు తీసుకుంటున్నారు.
Rajinikanthఇదిలా ఉంటే ఇద్దరు కూతుళ్లు టీనేజ్లో ఉన్నప్పుడు రజనీకాంత్, భర్య లతాలతో దిగిన రేర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Rajinikanth
రజనీకాంత్ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు వంటి వారు నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Rajinikanth