రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల, బోయపాటి, పూరీ.. స్టార్ హీరోలని మించిన రెమ్యూనరేషన్స్
చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్స్ కోట్లల్లో ఉంటుంది. కానీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి, పూరీజగన్నాథ్, అనిల్రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ రెమ్యూనరేషన్స స్టార్ హీరోల పారితోషికం కంటే ఎక్కువే కావడం విశేషం.
సినిమా హీరో కోణంలో సాగుతుంది. ఓ సినిమాని మార్కెట్ చేసేది హీరోనే. హీరోని చూస్తే ఆడియెన్స్ థియేటర్కి వస్తాడు. అయితే కొంత మంది దర్శకులు మాత్రం అందుకు భిన్నం. ఈ దర్శకులే తమ సినిమాల కోసం ఆడియెన్స్ ని రప్పిస్తారు. ప్రేక్షకులు కూడా ఫలానా దర్శకుడు తీసిన సినిమా అని థియేటర్కి వస్తారు. అలాంటి దర్శకులు మన టాలీవుడ్లో ఉండటం విశేషం. అంతేకాదు ఆయా దర్శకులకు స్టార్ హీరోలకు మించిన పారితోషికాలు అందుతుండటం మరో విశేషం. సినిమా మార్కెట్ పెరిగింది. దర్శకుల ప్రయారిటీ పెరిగింది. హీరోతోపాటు కథ, దర్శకుడు కూడా ముఖ్యమని నమ్మే రోజులొచ్చాయి. దానికి తగ్గట్టే డైరెక్టర్స్ పారితోషికాలు కూడా పెరిగారు. మరి స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్స్ పుచ్చుకుంటున్న డైరెక్టర్స్ ఎవరో చూద్దాం.
టాలీవుడ్ని `బాహుబలి`తో ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా అంటే హీరోలకు అతీతంగా థియేటర్కి వచ్చే జనాలున్నారు. అంతగా తనకంటూ ఓ బ్రాండ్ని ఏర్పర్చుకున్నారు జక్కన్న. ప్రస్తుతం ఆయన `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన రూ. ముప్పై కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతేకాదు లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నట్టు టాక్.
టాలీవుడ్లో మాటల మాంత్రికుడిగా పాపులర్ అయిన త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ లు క్రియేట్ చేశారు. దీంతో ఈయన పారితోషికం కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. దీనికి 20 నుంచి 25కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నట్టు భోగట్టా.
క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుకుమార్ `రంగస్థలం` నుంచి తన పవర్ ఏంటో చూపించారు. ఈ సినిమా రెండు వందల కోట్లు వసూళ్లని రాబట్టింది. దీంతో ఆయన రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్తో `పుష్ప` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన 23 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట.
సామాజిక సందేశాలను కమర్షియల్గా చెప్పడంలో దిట్ట కొరటాల శివ. `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` చిత్రాలతో ఆయన ఓ ట్రెండ్ సెట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య` చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 20 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారట. నెక్ట్స్ ఆయన బన్నీతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `ఆచార్య` సక్సెస్ ని బట్టి ఆ సినిమా పారితోషికం కూడా మారిపోయే ఛాన్స్ ఉంది.
టాలీవుడ్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ఒకే ఒక్కరు పూరీ జగన్నాథ్. సినిమా టేకింగ్లో, హీరోని చూపించడంలో ఆయన స్టయిల్ డిఫరెంట్. ఆయనకు ఆయనే సాటి. ఆయన సినిమాలు సాలిడ్గా పడితే బాక్సాఫీసు బొమ్మ పగిలిపోవాల్సిందే. `ఇస్మార్ట్ శంకర్`తో సక్సెస్ కొట్టిన పూరీ మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ `లైగర్` రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దాదాపు పది కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నారట. తన సొంత బ్యానర్లోనే సినిమా తెరకెక్కిస్తుండటంతో రెమ్యూనరేషన్ అనేది ఆయనిష్టం.
కమర్షియల్ ఎంటర్టైనర్కి అనిల్రావిపూడి కేరాఫ్గా నిలుస్తున్నారు. `రాజాది గ్రేట్`, `ఎఫ్2`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలతో తన సత్తా చాటారు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పారితోషికం కూడా బాగానే అందుకుంటున్నారు. `సరిలేరు నీకెవ్వరు` సక్సెస్తో తన పారితోషికం పెంచారు. ప్రస్తుతం ఆయన `ఎఫ్3`కి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట.
వీరితోపాటు మరికొందరు దర్శకులు యంగ్ హీరోల రేంజ్లో పారితోషికాలు అందుకుంటున్నారు. వారిలో నాగ్ అశ్విన్ కూడా ఉంటారు. `మహానటి`తో యావత్ చిత్ర పరిశ్రమ చూపుని తనవైపు తిప్పుకున్నారు నాగ్ అశ్విన్. ఇప్పుడు ప్రభాస్తో ఓ సైన్స్ ఫిక్షన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనకు ఎనిమిది కోట్లకుపైనే ఇస్తున్నారట. సినిమా పట్టాలెక్కడం, విడుదలయ్యాక ఈ పారితోషికంలో మార్పులుండే ఛాన్స్ ఉందని టాక్. ప్రభాస్ సినిమాతో ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పుడు మంచి క్రేజ్లో ఉన్న దర్శకుల్లో పరశురామ్ ఒకరు. `గీతగోవిందం`తో ఆయన బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఆ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడంతో పరశురామ్ సత్తా ఏంటో తెలిసింది. ప్రస్తుతం ఆయన మహేష్ తో `సర్కారు వారి పాట` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకిగానూ ఆయనకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు పారితోషికం అందిస్తున్నారని సమాచారం.
అలాగే మంచి కూల్ ఎంటర్టైనర్స్, నయా లవ్ స్టోరీలు రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కో సినిమాకి ఐదు కోట్లు తీసుకుంటున్నారట. ప్రస్తుతం రూపొందించిన `లవ్స్టోరి`కి కూడా ఐదు కోట్లు తీసుకున్నారని టాక్.
ప్యాషన్ ఉన్న దర్శకుడు, కంటెంట్ ఉన్న డైరెక్టర్ క్రిష్ ఒక్కో సినిమాకి దాదాపు ఐదు కోట్లు అందుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు పవన్తో `హరిహర వీరమళ్లు` సినిమా చేస్తున్నారు. దీనికి పది కోట్లకుపైనే పారితోషికం అందుకునే అవకాశాలున్నాయి.
`గబ్బర్ సింగ్` డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ఫామ్లో లేదు. త్వరలో ఆయన పవన్తో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ఐదు కోట్ల వరకు పారితోషికం అందుకునే అవకాశాలున్నాయి.
`సైరా` సినిమాతో సురేందర్ రెడ్డి రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అఖిల్తో `ఏజెంట్` సినిమా చేస్తున్నారు. దీనికి ఎనిమిది కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడని సమాచారం.