యూట్యూబ్లో చూసి షాక్ అయ్యా.. సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన మాజీ సీఎం భార్య
కన్నడ హీరోయిన్, మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమార స్వామి సినిమాను కొంత మంది అనుమతి లేకుండా యూట్యూబ్లో పెట్టేశారు. నిర్మాత కూడా అయిన రాధిక స్వీటీ నాన్న జోడి అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విజయలక్ష్మీ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 నవంబర్లో రిలీజ్ అయ్యింది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్ లైన్ లావాదేవిల విషయంలో వరుసగా మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా డిజిటల్ కంటెంట్ విషయంలో కూడా ఇలాంటి మోసాలే తెర మీదకు వస్తున్నాయి. పైరసీ కారణంగా సినిమా రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిజిటల్ రైట్స్ లేకుండానే కొంత మంది మరొకరి కంటెంట్ను వాడేసుకుంటున్నారు.
తాజాగా అలాంటి అనుభవమే కన్నడ హీరోయిన్, మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమార స్వామికి ఎదురైంది. నిర్మాత కూడా అయిన రాధిక స్వీటీ నాన్న జోడి అనే సినిమాను నిర్మించింది. ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విజయలక్ష్మీ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 నవంబర్లో రిలీజ్ అయ్యింది.
అయితే అప్పట్లో డిజిటల్ హక్కలకు ప్రస్తుతం ఉన్నంత డిమాండ్ లేకపోవటంతో ఆమె ఆ హక్కులను ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంది. కానీ ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు రాధిక పర్మిషన్ లేకుండా ఆ సినిమాను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన రాధిక కుమారస్వామి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
తాను మూడు కోట్లు పెట్టి సినిమా తీశానని, కానీ ఓ యూట్యూబ్ ఛానల్ తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, హక్కులు కొనకుండా తన సినిమాను స్ట్రీమ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన సినిమా యూట్యూబ్లో చూసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి చీటింగే అంటూ తన కంప్లయింట్లో పేర్కొంది రాధిక. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కన్నడ సీమలో స్టార్ హీరోయిన్గా ఉన్న రాధికను కుమార స్వామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్రస్తుతం మళ్లీ బిజీ అయ్యింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కుతున్న భైరాదేవి సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది రాధిక.