ప్రభాస్ `ప్రాజెక్ట్ కే` రెండు భాగాలు?.. నాగ్ అశ్విన్ సంచలన నిర్ణయం.. ఫస్ట్ పార్ట్ వచ్చేది అప్పుడే?
ప్రభాస్ ఫ్యాన్స్ కి సంబరాలు చేసుకునే ఓ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. `ప్రాజెక్ట్ కే` సినిమా రెండు భాగాలుగా వస్తుందనే వార్త సంచలనంగా మారింది.
`బాహుబలి`, `సాహో`, `రాధేశ్యామ్` చిత్రాలతో ప్రభాస్(Prabhas) ఇమేజ్ అమాంతం పెరిగింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు చేస్తున్న `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కే`(Porject K) చిత్రాలతో ఆయన గ్లోబల్ వైడ్గా వ్యాపించబోతుంది. ఇందులో ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇండియన్ బాక్సాఫీసు షేక్ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `బాహుబలి2` రికార్డులు బ్రేక్ కావడం ఖాయం.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటిస్తున్న `ప్రాజెక్ట్ కే` చిత్రం నుంచి ఓ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కథ పరిధి చాలా పెద్దగా ఉండటంతో ఒకే సినిమాలో ఇమడ్చడం కష్టంగా ఉందని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట `బాహుబలి`ని ఒకే పార్ట్ గా అనుకున్నారు, మధ్యలో రెండు పార్ట్ లుగా తీశారు. అది ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు `ప్రాజెక్ట్ కే` విషయంలోనూ అదే జరుగుతుందా? అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఆల్మోస్ట్ మొదటి పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. రెండో పార్ట్ షూటింగ్ పెండింగ్లో ఉందట. దీంతో మొదటి భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాయి. అయితే దాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. రెండో పార్ట్ కి ఇంకో రెండు సంవత్సరాలు అంటే 2025లో విడుదల చేసే ఛాన్స్ ఉందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర మహాభారతంలోని అశ్వత్థామ పాత్రని పోలి ఉంటుందట. అలాగే ప్రభాస్ పాత్ర సూపర్ హీరో పోలి ఉంటుందని, యుద్ధ వీరుడి తరహాలో ఆయన పాత్ర కొనసాగుతుందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతూ, హాలీవుడ్లో సూపర్ హిరో సినిమాలు వస్తున్నాయి. మన వద్ద విడుదలై భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అలాంటి సినిమా మనం ఎందుకు తీయకూడదనే ఆలోచనతో `ప్రాజెక్ట్ కే` పుట్టిందని, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అని తెలిపారు. దీనిపై రైటర్ బుర్రా సాయిమాధవ్ చెబుతూ, సినిమా చూస్తే నెల, రెండు నెలల పాటు అదే హ్యాంగోవర్లో ఉండిపోతారని, అంతగా హంట్ చేస్తుందని, అసలు అలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయమన్నారు. ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు చూడనటువంటి కథ అని, ఇలాంటి ఆలోచన, ఈ పాయింట్ ఎవరికీ రాదని, మహా అద్బుతం అని తెలిపారు. ఆ విజువల్స్ కూడా ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరని, కళ్ల సంబురంగా ఉంటుందని, దాన్ని వర్ణించతరం కాదన్నారు. ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లే మూవీ అవుతుందన్నారు. ఇదొక సంచలనం అని చెప్పారు.