అరబ్ దేశంలో అందాల సుందరి, మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్
టాలీవుడ్ లో గ్లామర్ పరంగా తనకు తిరుగులేదు అని నిరూపించుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో.. అదరగొడుతోంది బ్యూటీ. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది బ్యూటీ.

ఈ మద్య సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచుతోంది ప్రగ్యా జైస్వాల్.. అందాల ఆరబోతలో తనకు తానే అంటోంది. సినిమాల పరంగా కాస్త డౌన్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రగ్యా అవకాశాల కోసం సోషల్ మీడియాను గట్టిగా వాడేస్తోంది.
చాలా కాలంగా మంచి అవకాశం కోసం.. మంచి విజయం కోసం ఎదురు చూస్తో ప్రగ్యా అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ విజయంతో మంచి అవకాశంతో పాటు.. సూపర్ సక్సెస్ కూడా రావడంతో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ.
బోయపాటి డైరెక్షన్ లో యాక్షన్ మూవీగా వచ్చిన అఖండలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధంచింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది.
అఖండ సినిమాతో ప్రగ్యా కెరీర్ మళ్ళీ ఊపు అందుకుంది. ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ..పట్టుబిగించాలి అని చూస్తోంది ప్రగ్యా. అందుకే సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అందంతో హడావిడి చేస్తోంది.
కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఈ సినిమాలో హోమ్లీగా కనిపించింది. ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోనంటోంది.
ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇస్తాంబుల్ వెళ్ళిన ఈ బ్యూటీ.. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. అ పిక్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేస్తోంది.