మెగా ఫ్యామిలీకి దూరంగా పవర్ స్టార్....? అకీరా, ఆద్య తో పవన్ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ట్విస్ట్ ఏంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారా...? బెంగళూరు ఫామ్ హౌస్ కు రాకుండా.. తన పిల్లలతో కలిసి పొంగల్ ఎంజాయ్ చేస్తారా..? వైరల్అవుతున్న ఫోటోలు నిజం ఎంత..?
ఈ సంక్రాంతిని సామ్యులుసెలబ్రిటీలు అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సెబ్రిటీలు అయితే ఎంతో ఘనంగా సంక్రాంతి జరుపుకున్నారు. ఈక్రమంలో మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరు ఫామ్ హౌస్ కు వెళ్ళి..సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకున్నారు. అందులో మెగా అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. కొత్త జంట వరుణ్ తేజ్.. లవణ్యలు కూడా పండుగ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hm68959cmp9e3rec2jcv6zq0/mega-family--1--jpg_300x375xt.jpg)
అయితే ఈమెగా బ్యాచ్ లో మిస్ అయ్యింది మాత్రం పవర్ స్టార్ మాత్రమే.. ఆయన రాలేదు.. కాని వారి పిల్లలు మాత్రం అక్కడ సందడి చేశారు. ఆ ఈవెంట్ అందరు పిల్లలతో పాటు.. పవర్ స్టార్ కిడ్స్ కూడా సందడి చేశారు. అందరిలో వీరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులో పవర్ స్టార్ పిల్లలు కనిపించి.. పవన్ కళ్యాణ్ కనిపించకపోయేసరికి ఆయన్ను ఎంతగానో వెతికారు. కాని వారు అందులో లో కనిపించలేదు. దాంతో మెగా ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు.
అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పొలిటికల్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు. దాంతో రావడం కుదరలేదు అది తెలిసిందే.. ఈక్రమంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. అదేంటంటే..పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ.. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ అంతా పార్మ్ హౌస్ లో సంబరాలు చేసుకుంటుంటే.. బెంగళూరు వెళ్ళకుండా... అకీరా ఆద్యాలతో కలసి పవన్ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆ ఫోటోలో తెలుస్తోంది.
వీరి సెలబ్రేషన్స్ కు సంబంధించిన పోటో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఇది ఓరిజినల్ ఫోటో కాదు. . పవర్ స్టార్ సంక్రాంతి సెలబ్రేట్ చేయలేదు.. అయితే పవన్ కళ్యాణ్ సంక్రాంతి ఫోటో ఫేక్. ఫ్యాన్స్ అకిరా – ఆధ్యా- పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని క్రాప్ చేసి ఎడిట్ చేసి కొత్త ఫొటోస్ ని రిలీజ్ చేశారు. ఈ ఫొటోస్ గ్రాఫిక్ అని తెలుస్తున్న సరే చూడడానికి చాలా బాగున్నాయి. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం తెలియక అపార్దం చేసుకుంటున్నారు.
మొత్తానికి మెగా ప్యామిలీ అంతా బెంగళూరులో సంబరాలు చేసుకునిహైదరాబాద్ చేరారు. ఇక అక్కడ అంతా సంబరాలు చేసుకుంటుంటే.. వెళ్ళి వారితో కలిసి సెలబ్రేట్ చేయోచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. . మొత్తానికి పవన్ కళ్యాణ్ తన కూతురు కొడుకుతో దిగిన ఫొటోస్ వైరల్ అవుతుంది.ఇక ఇది ఇలా ఉంటే.. ఈమధ్య ఈ డీప్ పేక్ ఫోటోస్ సెలబ్రిటీస్ ను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా సచిన్ వీడియో కూడా అలానే వైరల్ అయితే.. ఆయన క్లారిటీ ఇచ్చారు.