పూనమ్ కౌర్ కి భయంకరమైన వ్యాధి.. బట్టలు కూడా వేసుకోలేని స్థితి, ఎవరి దగ్గరికి వెళ్లిందంటే
పూనమ్ కౌర్ మూడేళ్ళుగా నరకం అనుభవిస్తున్నట్లు చెబుతోంది. కనీసం బట్టలు వేసుకోవడం కూడా కుదరడం లేదట. అంత తీవ్రంగా ఈ వ్యాధి ఉన్నట్లు పూనమ్ చెబుతోంది.
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ కి అరుదైన వ్యాధి సోకిందట. ఈ విషయాన్ని పూనమ్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. పూనమ్ కౌర్ కి సోకినా వ్యాధి ఫైబ్రోమయాల్జియా. సమంతకి సోకినా మాయోసైటిస్ కి కాస్త దగ్గర లక్షణాలు ఉన్నట్లు ఉన్నాయి.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు కానీ.. నొప్పులకు కారణం అవుతుంది.
ముఖ్యంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది
ఈ వ్యాధితో పూనమ్ కౌర్ మూడేళ్ళుగా నరకం అనుభవిస్తున్నట్లు చెబుతోంది. కనీసం బట్టలు వేసుకోవడం కూడా కుదరడం లేదట. అంత తీవ్రంగా ఈ వ్యాధి ఉన్నట్లు పూనమ్ చెబుతోంది. గతంలో పూనమ్ ఈ వ్యాధి కోసం కేరళలో ఆయుర్వేద వైద్యం ప్రయత్నించిందట.
ప్రస్తుతం పూనమ్ కౌర్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన నేచురోపతి లెజెండ్ డాక్టర్ మంతెన సత్యనారాయణని కలిసినట్లు పూనమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన నుంచి విలువైన సలహాలు తీసుకున్నట్లు పేర్కొంది. మంచి మనసు గల వ్యక్తితో కలసి ఒక ఎపిసోడ్ లో పాల్గొనడం తన అదృష్టం అని పూనమ్ పేర్కొంది.