వైరల్ పిక్స్ :పూజ హెగ్డే ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్లుగా .. మొదటగా వినిపించే పేర్లలో పూజ హెగ్డే ఒకరు. అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’తో ఈ ఏడాది భారీ హిట్ కొట్టింది పూజ. ఆ తర్వాత వరుస సినిమాలు సంతకం చేసేస్తుంది అనుకున్నా... కరోనా-లాక్డౌన్ కారణంగా ఆమె కొత్త సినిమాలేవీ పట్టాలెక్కలేదు. అయితే, ఆమె ఇంటి పట్టున ఉంటూ వర్కవుట్స్ చేస్తూ తన అందం పెంచుకునే పనిలో ఉంది. దాదాపు ఆరు నెలలు తర్వాత షూటింగ్ కు రెడీ అయ్యింది. ఈక్రమంలో తనెలా ఉన్నానో ..ఓసారి తన సెక్సీనెస్ ని ఇలా ఆరబోస్తూ ఫోస్ ఇచ్చింది. మీరూ ఓ లుక్కేయండి.అలాగే ఆమె తాజా ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకోండి.
ప్రస్తుతం పూజ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే అంగీకరించిన ప్రభాస్తో ‘రాధే శ్యామ్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సెట్స్పై ఉన్నాయి.
పూజ హెగ్డే ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతున్న నెంబర్ వన్ హీరోయిన్ అనటంలో సందేహం లేదు. పూజ తో పోటీ పడుతున్న రశ్మిక సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అయింది. దాంతో అంతా రష్మిక టాప్ అన్నారు. కానీ పూజ హవా చూస్తూంటే మళ్ళీ పూజానే టాప్.
వరుసగా పెద్ద సినిమాలున్నాయన్నా ఆలోచన వల్లనో లేక, ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన కిక్ వల్లనో కానీ, పూజ పారితోషికం పెంచేసిందట.
‘అల వైకుంఠపురములో’కు పూజా హెగ్డే ₹1.4 కోట్లు తీసుకుందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పుడు ఆమె తన పారితోషికాన్ని రూ. రెండు కోట్లకు పెంచేసిందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు పూజ తీసుకున్న అత్యధిక పారితోషికం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’ కోసమే. ఆ సినిమాకు సుమారు రూ.కోటిన్నర ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి.
ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ వరకు ఆమె అంగీకరించిన సినిమాలకు రూ.కోటికి అటుఇటుగానే తీసుకుందట.
ఇప్పుడు పూజ ఎందుకు పారితోషికం పెంచింది అంటూ కొంతమంది ఆలోచిస్తుంటే... దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఫేమ్ ఉన్నప్పుడు పారితోషికం తీసుకోవాలి అని ఇంకొందరు అంటున్నారు
ఇంతవరకూ బాగున్నా కరోనా సమయంలో పారితోషికాలు తగ్గించుకోవడానికి కొంతమంది నటీనటులు నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పూజ పారితోషికం పెంచేసింది అంటూ వార్తలు రావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సల్మాన్ ఖాన్ నటించబోతున్న ‘కబి ఈద్ కబి దివాళి’ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించబోతున్నారు.
‘ఈ సినిమా చర్చల దశ ముగిసిన తర్వాత.. హీరోయిన్ గా నన్ను తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఎంతో సంతోషంగా అనిపించింది. సల్మాన్తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని బుట్టబొమ్మ పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్, అఖిల్ అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దగుమ్మకి ఎలాంటి అబ్బాయి కావాలో చెబుతుంది. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పుడే లేదనుకోండి అంటోంది.
కానీ పూజ కి ఇష్టమైన రెండు పనులు చేస్తే ఇట్టే పడిపోతుందట. చాలామంది అమ్మాయిలను ఇంప్రెస్స్ చెయ్యడానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ పూజకు అవేమీ అవసరం లేవట.
కానీ పూజ లాంటి అమ్మాయిని పదెయ్యాలంటే మంచి ఫుడ్ పెట్టడమో లేదా కాండిల్ లైట్ డిన్నర్కి తీసుకువెళ్తే చాలు పూజ హెగ్డే పడిపోతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పూజ హెగ్డే తనని పదెయ్యాలంటే ఫుడ్ లేదా కాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్తే చాలని.. చెప్పింది.
తాను మంచి ఫుడ్ లవర్ అని, మంచి ఫుడ్ అంటే.. నాకిష్టమైన ఫుడ్ పెడితే చాలని ఈజీగా పడిపోతా అని, ఒకవేళ ఫుడ్ తో ఇంప్రెస్ చెయ్యలేకపోతే.. ఏ కాండిల్ లైట్ డిన్నర్కి తీసుకువెళ్తే చాలు తొందరగా పడిపోతాని వివరించింది.
ఇంకా వినయం, ఇంటెలిజెంట్ ఉన్న అబ్బాయిలంటే ఇష్టమని చెబుతుంది. మరి పూజ హెగ్డే కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లి ముచ్చట చెబుతుందా ఏమిటి అంటున్నారు.
ఇక ప్రభాస్ సినిమా సెట్లో నిశ్శబ్దంగా ఉండరని పూజా హెగ్డే చెప్పారు. వీరిద్దరు కలిసి దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
యూరప్ నేపథ్యంలో రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల ఈ చిత్రం జార్జియా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ చిత్రం గురించి ముచ్చటించారు.
‘లాక్డౌన్ కన్నా ముందే భారత్కు తిరిగి రావడం మా అదృష్టం. జార్జియాకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. కరోనా నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్ రావాలనే ఉద్దేశంతో షూటింగ్ను ముందుగానే ముగించుకున్నాం.
జార్జియా నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. సెట్లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి షూటింగ్ చాలా చక్కగా ఉంటుంది’ అని చెప్పారు.
తన గురించి చెప్తూ..నేను ముంబయ్లో పుట్టాను. కానీ, మా అమ్మానాన్నలది కర్ణాటకలోని మంగళూరు. మా మాతృభాష తుళు. ఇంట్లో అందరూ తుళు మాట్లాడతారు. కన్నడ కూడా వచ్చు.
నేను చిన్నప్పట్నుంచి ముంబయ్లో పెరగడం వల్ల హిందీ, మారాఠీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. ప్రస్తుతం మా ఫ్యామిలీ ముంబయ్లోనే సెటిల్ అయ్యింది.
అమ్మ పేరు లత. లా చదివారు. ఇప్పుడు హౌస్ వైఫ్. నాన్న పేరు మంజునాథ్. ఆయన క్రిమినల్ లాయర్. నాకో అన్నయ్య ఉన్నాడు. పేరు రిషబ్ హెగ్డే. తను డాక్టర్. మా ఫ్యామిలీకి సినిమాలతో సంబంధం లేదు
‘మొహెంజోదారో’ లాంటి గ్రాండ్ స్కేల్ మూవీస్ అరుదుగా వస్తాయి. ఆ సినిమా నటిగా నాకో మంచి ఎక్స్పీరియన్స్.
నిజానికి ఆ మూవీ కమిట్ అయినప్పుడే అంత టైమ్ పడుతుందన్నారు. ఓకే అన్నాను. సినిమా కమిట్ అయినప్పుడు ఆనందపడి, అనుకున్న రిజల్ట్ రాకపోతే ‘ఎందుకు చేశామా?’ అని పశ్చాత్తాపపడటం కరెక్ట్ కాదు కదా.
హీరోయిన్ల కెరీర్కి లాంగ్విటీ తక్కువ. బ్రేక్ లేకుండా సినిమాలు చేయాలి. అయితే ఒక్కోసారి మనం డిజైన్ చేసినట్లుగా జరగదు.
అయినా నాకు పెద్ద బ్రేక్స్ ఏవీ లేవు. కాకపోతే, ఒక గ్రాండ్ స్కేల్ మూవీతో ఎటాచ్ అయినప్పుడు దాంతో పాటు వేరే సినిమా చేయలేం. అదే రెగ్యులర్ మూవీస్ అనుకోండి... ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే స్కోప్ ఉంటుంది..
నాకు తెలిసి ప్రతి అమ్మాయి లైఫ్లో స్కూల్ డేస్లో ‘ఐ లవ్ యు’ వంటివి ప్రపోజల్స్ కామన్. నాకు అలాంటి ఎక్సపీరియన్స్ ఉంది.
స్కూల్ డేస్లో ఒక అబ్బాయి నన్ను ఫాలో అయ్యేవాడు. నేనేమో టామ్బాయ్ టైప్. రఫ్ఫాడించేసేలా ఉండేదాన్ని. అందుకని నాకు ప్రపోజ్ చేయడానికి భయపడ్డాడేమో . ఒకరోజు ధైర్యం చేసుకుని, విషయం చెప్పడానికి వచ్చాడు. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ ఒక్కసారిగా నవ్వేశారు. అతను చెప్పడానికి ఇబ్బందిపడిపోయి, వెళ్లిపోయాడు.
హీరోయిన్ అవుతాననుకోలేదు. అనుకోకుండా అందాల పోటీల్లో పాల్గొన డం, ఆ తర్వాత మోడలింగ్.. అట్నుంచి సినిమాలు.. కలలా జరిగిపోయింది అంది.
బాక్సాఫీస్ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న అరవింద... మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి.. పూజా హెగ్డే