పూజా బేబి గుండె బద్దలైన వేళ...ఆ చేదు అనుభవంతో మూడేళ్లు బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు
నాలుగవ సినిమాతోనే హృతిక్ రోషన్ కి జంటగా నటించే అవకాశం దక్కించుకున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొహంజోదారో మూవీతో పూజ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమా విడుదలైన మూడేళ్ళ తరువాత గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 మూవీ చేయడం జరిగింది. బాలీవుడ్ లో పూజా హెగ్డేకు ఇంత గ్యాప్ రావడానికి కారణం తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
'లోకానికి మనల్ని పరిచయం చేసే మొదటి చిత్రం అంటే అందరికీ ప్రత్యేకమే. నా మొదటి హిందీ చిత్రం మొహంజోదారో చిత్రం కోసం నేను కొన్ని సినిమాలు వదులుకొని దానికోసమే పని చేశాను. ఆ సినిమా పరాజయం కావడంతో నాగుండె పలిగింది' అన్నారు.
ఆ సినిమా ఫలితం పూజాను షాక్ కి గురి చేయగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని, మంచి చిత్రంలో నటించాలని డిసైడ్ అయ్యిందట. హౌస్ ఫుల్ 4 సక్సెస్ సంతోషాన్ని కలిగించిందని పూజ హెగ్డే చెప్పుకొచ్చారు.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కనున్న సర్కస్ మూవీలో పూజ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. జాక్విలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా సర్కర్ మూవీలో నటిస్తున్నారు.
ఇక రోహిత్ శెట్టి చిత్రాలు అంటే ఇష్టమన్న పూజ హెగ్డే, ఆయన తెరకెక్కించిన సింబా మూవీ వాళ్ళ నాన్నతో కలిసి చూసిందట. ఆ మూవీలో అజయ్ దేవ్ గణ్ ఎంట్రీ అద్భుతం అని పూజా రోహిత్ శెట్టిని కొనియాడారు.
తెలుగులో పూజ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. యంగ్ హీరో అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ లో కూడా పూజ హీరోయిన్ గా నటిస్తున్నారు. పూజ బర్త్ డే కానుకగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.