ముదురుతున్న తాప్సీ వివాదం, బాలీవుడ్ హీరోయిన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తాప్సీ ఓ వీవాదంలో చిక్కుకుంది. అంతే కాదు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటీ..? పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారు..? అసలు జరిగింది ఏమిటంటే..?
కాంట్రవర్సీలకు కేరాఫ్ అండ్రస్ గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో మొదటి ప్లేసు కంగనాది అయితే.. రెండో ప్లేస్ తాప్సీకి ఇవ్వొచ్చు. ఈమె కూడా కాస్త ముక్కు సూటి మనిషి. చాలా విషయాల్లో బాలీవుడ్ కు ఎదురెల్లింది బ్యూటీ. చాలా మందిని సోషల్ మీడియా వేదికగా కడిగిపారేసింది. అంతే కాదు ఆమె అప్పుడప్పుడు చేసే కొన్ని పనులు తాప్సీని వివాదాల్లోకి నెట్టాయి. ఇప్పటికీ ఆమె విషయంలో కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి.
Actress Taapsee Pannu who went to look bold and made a mistake
ఈ మధ్య హిందువుల మనోభావాలకు గాయం అయ్యేలా వ్యావహరించింది తాప్సీ. దాంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్షలు వచ్చాయి. రీసెంట్ గా తాప్సి లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. రెడ్ డ్రెస్ లో తాప్సి క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ఆ ఫ్యాషన్ షోలో ఆమె కనబడిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆమెపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
Taapsee Pannu
అయితే ఈ షోలో తాప్సీ..హిందువుల ఆరాధ్యదైవం లక్ష్మీదేవి లాకెట్ వేసుకుంది. ఆమె తన ఎదఅందాలు కనిపించేలా డ్రస్ వేసుకుని వాటి మధ్య ఈ లాకెట్ ను వేసుకుంది తాప్సీ.. అంతే కాదు ఫ్యాషన్ పెరేడ్ లో వాక్ కూడా చేసింది. మితిమీరిన గ్లామర్ ప్రదర్శనతో.. ప్రైవేటు పార్ట్స్ కనబడేలా బట్టలు వేసుకోవడమే కాకుండా.. హిందూ దేవుళ్లను ఇలా అవమానిస్తారా అంటూ.. మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.
Image: Taapsee Pannu / Instagram
దీనిపై వివాదం ముదురుతోంది. ఈ విషయంలో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటని మండిపడుతున్నారు. ఇక తాప్సీపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. అక్కడక్కడ ఆమెపూ కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
Image: Taapsee Pannu / Instagram
దాంతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై కేసు నమోదు అయ్యింది. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు, లక్ష్మీదేవి లాకెట్ ధరించి అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు.. ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ తాప్సీ మీద కేసు వేశారు.
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లో తన కెరీర్ స్టార్ట్ చేసింది తాప్పీ. ఆరువాత ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి లాంటి సినిమాలు చేసింది. సౌత్ లో పెద్దగా అవకావాలు, హిట్లు లేకపోవడంతో.. బాలీవుడ్ కు షిప్ట్ అయ్యింది. అక్కడ కూడా ఎక్కువగా విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసిన బ్యూటీ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తుంది.