ఓటములనే తట్టుకున్నాడు, కరోనా ఎంత... పవన్ పై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోవిడ్ బారినపడడం ఆయన ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. జ్వరం, జలుబు వంటి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ టెస్ట్స్ చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
హైదరాబాద్ లోని తన ఫార్మ్ హౌస్ లో కొరెంటైన్ అయిన పవన్ కళ్యాణ్ అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ అనారోగ్యంపాలవడం ఆయన ఫ్యాన్స్ ని కలవర పెడుతుంది. సోషల్ మీడియా వేదికగా పవన్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా తమ్ముడు పవన్ ని ఏమీ చేయలేదని ఆయన కామెంట్ చేయడంతో పాటు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ జీవితంలో అనేక వడిదుడుకులు చూశారు. విలువలు కోసం పోరాడే వ్యక్తి. ఓటములతో కృంగిపోని శిఖరం. అలాంటి పవన్ కళ్యాణ్ ని కరోనా ఏమీ చేయలేదని నాగబాబు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, తమ్ముడిపై తన ప్రేమ చాటుకున్నారు.
వకీల్ సాబ్ మూవీ ప్రమోషన్స్, తిరుపతి బై ఎలక్షన్స్ ప్రచారం కోసం పవన్ విస్తృతంగా జనాల్లో తిరిగారు. వకీల్ సాబ్ మూవీ టీమ్ లోని కొందరు కరోనా బారిన పడ్డారు. నిర్మాత దిల్ రాజుకు కరోనా సోకింది.
అలాగే అయ్యప్పనుమ్ కోశియుమ్, వీరమల్లు షూటింగ్స్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. దీనితో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇక పవన్ కి కరోనా సోకడంతో ఆ రెండు చిత్రాల షూటింగ్ నిలిచిపోయింది.
మరోవైపు పవన్ లేటెస్ట్ రిలీజ్ వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. మొదటి వారానికే వకీల్ సాబ్ 100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ కలెక్షన్స్ బాగున్నాయి.
యూఎస్ లో మాత్రం వకీల్ సాబ్ వసూళ్లు నెమ్మదించినట్లు సమాచారం అందిస్తుంది. ఇంకా వకీల్ సాబ్ అక్కడ వన్ మిలియన్ వసూళ్లకు చేరుకోలేదు.
తెలుగు రాష్ట్రాలలో సైతం వకీల్ సాబ్ ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోలేదు. ఈ ఈవారం పెద్ద సినిమాల విడుదల లేదు. అది వకీల్ సాబ్ కి కలిసొచ్చే అంశం.