పవన్ కళ్యాణ్ `వకీల్సాబ్` యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రేక్షకులకు పూనకమే!
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్సాబ్`. ఈ సినిమా ఒక్క రోజు ముందే యూఎస్ వంటి ఇతర కంట్రీస్లో ప్రీమియర్స్ షో పడ్డాయి. తాజాగా ఆ రిపోర్ట్ వచ్చేసింది. ఆడియెన్స్ ఊగిపోయే రిపోర్ట్ అందుతుంది. మరి ఎలా ఉందో చూద్దాం.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలిచ్చే అభిమానులు లక్షల్లో ఉంటారు. అంతగా ఆయన్ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే పిచ్చిగా ఇష్టపడతారు. పవన్ అంటే ఓ వ్యసనం అని చెబుతుంటారు బండ్ల గణేష్ లాంటి అభిమానులు. అలాంటి అభిమాన హీరో మూడేళ్ల తర్వాత సినిమా చేస్తే, ఓ పవర్ ఫుల్ సందేశాత్మక చిత్రంతో వస్తే ఇక థియేటర్లలో పూనకమే. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. మరి పవన్ నటించిన `వకీల్ సాబ్` చిత్రం ఎలా ఉంది, యూఎస్ ప్రీమియర్స్ షో రిపోర్ట్ ఏంటి? అనే దానిపై ఓ లుక్కేద్దాం.
పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ ఆయనకు జోడిగా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం(ఏప్రిల్9)న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. హిందీ `పింక్` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్, దుబాయ్ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్ పడ్డాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ ఈ రోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచే బెనిఫిట్ షోస్ పడ్డాయి. థియేటర్లలో సందడి ఎర్లీ మార్నింగ్ నుంచే ప్రారంభమైంది. పవన్ సినిమా కావడంతో బెనిఫిట్ షో టికెట్లు రేట్లు వేలల్లో పలుకుతున్నట్టు తెలుస్తుంది.
ఇక యూఎస్ ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. హిందీ `పింక్`, తమిళంలో రూపొందిన `నేర్కొండ పార్వై` చిత్రాలు రెండు తాజాగా `వకీల్సాబ్`లో ప్రతిబింబిస్తున్నాయట. ఈ సందర్భంగా సినిమా కథేంటో చూస్తే... సత్యదేవ్(పవన్ కళ్యాణ్) లాయర్. తాగుడుకి బానిస. పవన్ కళ్యాణ్ తాగుతూ ఏదో ఫ్రస్టేషన్లో ఉంటాడు. మరోవైపు అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ముగ్గురు ఫ్రెండ్స్. వీరు కొందరు పెద్దింటి కుర్రాళ్ల వేధింపులకు గురవుతారు. తమని వేధించిన వాళ్లు పెద్దింటి కుటుంబాలకు చెందిన వాళ్లు. అయినా వారిపై పోరాడేందుకు ఈ ముగ్గురు కోర్ట్ మెట్లు ఎక్కుతారు. తమకి కోర్ట్ లో న్యాయం జరగాలంటే సమీపంలో ఉన్న లాయర్ పవన్ కళ్యాణ్ వాధిస్తే బాగుంటుందని భావిస్తారు. కొన్ని ప్రయత్నాల తర్వాత పవన్ ఈ కేసుని వాధించేందుకు ఒప్పుకుంటారు. ఇంటర్వెల్కి ముందు వీరి కేసుని టేకప్ చేస్తాడు పవన్. ఆ తర్వాత పవన్ తన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అందులో శృతి హాసన్ వస్తుంది. ఇది పూర్తయిన వెంటనే పవన్ కోర్ట్ మెట్లు ఎక్కుతాడు. సెకండాఫ్ కోర్ట్ లో ఈ అమ్మాయిల కేసు వాధించడం ప్రధానంగా సినిమా సాగుతుంది. మరి వాదోపవాదాలు ఎలా జరిగాయి. పవన్ గతం ఏంటి? `బద్రి`కి, ఇందులో అపోజిట్ లాయర్ ప్రకాష్ రాజ్కి ఉన్న సంబంధమేంటి? చివరికి కేసు గెలిచారా? లేదా? అనేది సినిమా.
సినిమా చూస్తే తమిళంలో అజిత్ నటించిన `నేర్కొండ పార్వై` పోలికలు కనిపిస్తున్నాయట. పవన్ కళ్యాణ్ ని తాగుబోతుగా చూపించడం, ఆయన ఒంటరిగా ఉండటం సన్నివేశాలు ఆలోచింప చేస్తాయని, సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాయని తెలుస్తుంది. మొదట సినిమా `మగువా.. మగువా.. `అనే సాంగ్తో ప్రారంభమవుతుంది. మహిళల గొప్పతనం తెలిపేలా ఈ పాట సాగుతుందని అంటున్నారు. మొదటి భాగం మొత్తం అమ్మాయిలు వేధింపులు ఎదుర్కొనడం, తమ కేసుని వాధించేందుకు పవన్ని ఒప్పించే ప్రయత్నం చేయడం మీద సాగుతుందట.
అయితే ఇంటర్వెల్కి ముందు ఓ ఫైట్ వస్తుందని, ఆ ఫైట్ గూస్బంప్స్ తీసుకొస్తుందని అంటున్నారు. ఇక పవన్ కోర్ట్ కి వెళ్లడం సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందట. కోర్ట్ లో ప్రకాష్ రాజ్ నందాగా కనిపిస్తారట. పవన్ నటించిన `బద్రి`సినిమా సెంటిమెంట్ వర్కౌట్ చేయడం కోసం ఆయనకు నందా అని పేరు పెట్టారట. ప్రకాష్రాజ్ నిందితుల తరఫున వాధించే లాయర్గా కనిపిస్తాడు. కోర్ట్ సీన్లు హైలైట్గా ఉంటాయని, ప్రధానంగా చాలా ఎమోషనల్గా, గ్రిప్పింగ్గా, ఉత్కంఠభరితంగా సాగుతాయని అంటున్నారు. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వాదోపవాదాలు పీక్లో ఉంటాయని తెలుస్తుంది.
సినిమాలో మొత్తం మూడు ఫైట్స్ ఉంటాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్, ఆ తర్వాత మధ్యలో వాష్రూమ్ ఫైట్, చివర్లో వచ్చే మెట్రో ఫైట్ హైలైట్గా ఉంటాయని, పూర్తిగా పవన్ మార్క్ స్టయిలీష్గా ఉంటాయట. ఈ ఫైట్స్ సీన్స్ లో అభిమానులు ఊగిపోతారని అంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ పాత్రని చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశాడట. రీఎంట్రీకి తగ్గట్టుగా, పవన్ ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో, పవన్ని ఏ రేంజ్లో చూపిస్తే అభిమానులు సాటిస్పై అవుతారో అలా ఆయన పాత్రని తీర్చిదిద్దారట. కమర్షియల్గా కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని మేళవించారని రిపోర్ట్ చెబుతుంది.
సినిమా మొత్తానికి బీజీఎం హైలైట్ అవుతుంది. తమన్ తన సంగీతంతో సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లాడని చెబుతున్నారు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణమని, అదే సినిమాని మరో లెవల్లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇక కోర్ట్ సీన్లలో, ఇతర సీన్లలోనూ ముగ్గురు అమ్మాయిల్లో నివేదా థామస్ నటన పీక్లో ఉంటుందట. ఆమె సన్నివేశాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెబుతున్నారు. నటీనటుల పరంగా అంజలికి కొంత ప్రయారిటీ ఉండగా, అనన్య కూడా తన పరిధిలో పర్వాలేదనిపిస్తుందట. ఇక ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఓవరాల్గా మొదటి భాగంగా కాస్త స్లోగా సాగితే, సెకండాఫ్లో గ్రిప్పింగ్గా, ఎమోషనల్గా సాగుతూ ఆడియెన్స్ ని పరుగులు పెట్టిస్తుందని టాక్. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు,జనరల్ ఆడియెన్స్ కూడా థియేటర్లలో డాన్స్ చేయడం ఖాయమంటున్నారు. ఇక యూఎస్,ఇతర కంట్రీస్లో సినిమా 250కిపైగా స్క్రీన్ల్లో పడింది. అక్కడ భారీ ఓపెనింగ్ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరికొత్త రికార్డ్ లు తిరగరాయబోతుందట. మరోవైపు మన స్టేట్స్ లోనూ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతుందట. మరి ఇది ఎలాంటి రికార్డ్ లు సృష్టిస్తుందో చూద్దాం.