హైదరాబాద్ మెట్రోలో `వకీల్ సాబ్` సందడి.. ప్రయాణికులతో ముచ్చట్లు.. ఫోటోస్ హల్చల్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `వకీల్ సాబ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా హైదరాబాద్ మెట్రోలో సందడి చేశారు. గురువారం ఆయన మెట్రోలో రైతులతో కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `వకీల్సాబ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ సినిమా `పింక్`కి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని బోనీ కపూర్ సమర్పణలో దిల్రాజు నిర్మిస్తున్నారు.
ఇందులో అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్.. పవన్ సరసన రొమాన్న్ చేయనుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.
తాజాగా గురువారం ఆయన హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. షూటింగ్ నిమిత్తం ఆయన మెట్రోలో ప్రయాణించినట్టు చిత్ర బృందం తెలిపింది.
మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు.
ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు. ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన శ్రీ చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న
పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
చిన సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు.
మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ ప్రయాణంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట చిత్ర నిర్మాత శ్రీ దిల్ రాజు ఉన్నారు.
పవన్ మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు
లాయర్ గెటప్లో పవన్ స్టయిలీష్గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.