సవాల్ విసిరిన యూనివర్సల్ బాస్ క్రిస్గేల్కి చుక్కలు చూపించిన తెలుగోడు..
వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. తెలుగు క్రికెటర్, ఇండియన్ టాప్ వన్ స్పిన్నర్ ని స్టేడియం బయట కొడతానన్నాడు. మరి తెలుగోడు ఏం చేశాడు. స్టేడియంలో చూసుకున్నాడు. సిక్స్ లతో సిక్స్ లతో రెచ్చిపోయే గేల్ని పొగరు అణిచాడు. వికెట్ తీసి అన్నీ మూసుకునేలా చేశాడు. అతనెవరో కాదు తెలుగు క్రికెటర్, బౌలర్ ప్రగ్యాన్ ఓజా. ఆయన తాజాగా సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్.. మంచి కిక్క్ ఇచ్చే గేమ్షో`లో హారిక, గుత్తా జ్వాల, మధుశాలినిలతో కలిసి పాల్గొన్నారు. అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
ప్రగ్యాన్ ఓజా మాజీ టీమిండియా క్రికెట్ ప్లేయర్. ఐసీసీ నెంబర్ వన్ స్పిన్నర్. టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్నీ ఫార్మాట్లలో బెస్ట్ బౌలర్గా రాణించిన ప్రగ్యాన్ ఓజా ప్రస్తుతం ఐపీఎల్క్, రంజీలకు పరిమితమయ్యారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01etry3awrmzbtay826amaep44/capture7-jpg_300x168xt.jpg)
ప్రస్తుతం ఆయన ఈటీవీలో సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమయ్యే `వాహ్..` షోలో పాల్గొన్నారు. ఆయనతోపాటు క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, గుత్తా జ్వాల, నటి మధుశాలిని పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇది జనవరి ఐదున ప్రసారం కానుంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఓజాతోపాటు పాల్గొన్న వారంతా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆద్యంతం సరదాగా, కామెడీగా ఈ షో సాగినట్టు ప్రోమోని చూస్తూంటే అర్థమవుతుంది.
ఇందులో ప్రగ్యాన్ ఓజా క్రికెట్కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. సాయికుమార్ కుమారుడు, హీరో ఆది.. తనతో కలిసి మొదట్లో క్రికెట్ ఆడారట. ఆ సమయంలో తనని బాగా ఒత్తిడి తెచ్చేవారని, బాగా ఆడిపించేలా చేయాలని చెప్పినట్టు వెల్లడించారు. వెస్టిండీస్ తనకిష్టమైన టీమ్ అని, ఆ టీమ్తో పది వికెట్లు తీశావని సాయి అనగా నవ్వులు పూసాయి.
ఇక నీకు బెస్ట్ వికెట్ ఏంటని సాయి కుమార్ అడగ్గా, క్రిస్ గేల్ అని ఓజా చెప్పారు. `ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేశాడు. బయట కొడతానని చెప్పాడు. స్టేడియం బయట.. మనం ఇండియన్స్ కదా సర్.. అందుకే వికెట్ తీశా` అని చెప్పాడు.
జ్వాలా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే. గుండె జారి గల్లంతయ్యిందే అంటూ ఆటపట్టించాడు సాయికుమార్. అందుకు ఆమె తలపట్టుకుంది. `గుండెజారి గల్లంతయ్యిందే` చిత్రంలో గుత్తా జ్వాల ఓ ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం ఆమె తమిళ నటుడు విష్ణు విశాల్తో ప్రేమాయణం సాగించారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుండటం విశేషం.
మరోవైపు తప్పు ఆన్సర్ ఇస్తే రీటేకా అని జ్వాలా అనడం, ఒకరికి తెలియకపోతే, మరొకరు షేర్ చేసుకోవచ్చా అని హారిక చెప్పడం నవ్వులు పూయించింది.
`బాహుబలి`ని ఎన్నిసార్లు చూసి ఉంటావని సాయి కుమార్ అడగ్గా, మెనీ టైమ్స్ అని తెలిపింది గుత్వా జ్వాల. అందుకు ఓజా స్పందిస్తూ సర్ అడిగేది `బాహుబలి`ని ప్రభాస్ని కాదని అనడం కామెడీని పంచింది.
`బాహుబలి`లో అనుష్కతో ప్రభాస్ చెప్పే `తప్పు చేస్తే నరకాల్సింది వేలు కాదు దేవసేనా.. తల` అనే డైలాగ్ చెప్పిస్తాడు సాయికుమార్. అందుకు నేను చెప్పింది సీరియస్గానే అని జ్వాల అనడం నవ్వించింది. మైండ్ గేమ్ అని మధుశాలిని వేసిన పంచ్ ఆకట్టుకుంది.
ఇలా ఆద్యంతం నవ్వులు, జోకులతో సాగిందీ షో. కానీ ఇందులో ఓజా చెప్పిన `లకలకలక.. ` డైలాగ్ హైలైట్గా నిలిచింది.
హోస్ట్ గా మరోసారి మెప్పించారు సాయికుమార్.